ETV Bharat / state

స్వామి వారి ఆశీస్సులతోనే బయట పడ్డాం: కలెక్టర్​

author img

By

Published : Oct 16, 2020, 1:50 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని కలెక్టర్​ అనితా రామచంద్రన్​ దంపతులు దర్శించుకున్నారు. నిన్న కారులో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. స్వామి వారి దయతోనే క్షేమంగా బయటపడినట్లు తెలిపారు.

collector anitha ramachandran visited yadadri temple
స్వామి వారి ఆశీస్సులతోనే బయట పడ్డాం: కలెక్టర్​

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతోనే నిన్న జరిగిన కారు ప్రమాదం నుంచి బయటపడ్డామని కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని కలెక్టర్​ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

కలెక్టర్ దంపతులకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనాలు చేశారు. ప్రమాద సమాచారం తెలిసి పరామర్శించిన అందరికీ కలెక్టర్​ ధన్యవాదాలు తెలిపారు.

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతోనే నిన్న జరిగిన కారు ప్రమాదం నుంచి బయటపడ్డామని కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని కలెక్టర్​ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

కలెక్టర్ దంపతులకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనాలు చేశారు. ప్రమాద సమాచారం తెలిసి పరామర్శించిన అందరికీ కలెక్టర్​ ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి: దుబ్బాక పోరు: భాజపా నేతల తీరుపై మంత్రి హరీశ్​రావు ఫైర్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.