దుబ్బాక ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ గౌరవం పెంచేలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. నిరంజన్రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. స్వామివారికి మంత్రి కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం ఇచ్చి.. స్వామివారికి లడ్డూ ప్రసాదం అందజేశారు.
భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై కేబినెట్లో చర్చించి.. కేంద్రానికి నివేదిక పంపించామని మంత్రి నిరంజన్ తెలిపారు. ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని స్పష్టం చేశారు . రైతులకు పరిహారం అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.