ETV Bharat / state

వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

author img

By

Published : Mar 5, 2020, 5:10 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 9వ రోజు స్వామివారు శ్రీమహావిష్ణు అలంకారంలో గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు బాలాలయంలో రథోత్సవం.. 8 గంటలకు కొండ కింద స్వామివారి ప్రచార రథం ఊరేగింపు వైభవంగా జరగనుంది.

9day bramosthavalu in Yadadri
వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామివారు శ్రీమహావిష్ణు అలంకారంలో గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వజ్ర వైఢూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధులో ఊరేగుతూ ధగధగ మెరిసిపోయారు. రాత్రి 7 గంటలకు బాలాలయంలో రథోత్సవం.. 8 గంటలకు కొండ కింద స్వామివారి ప్రచార రథం ఊరేగింపు వైభవంగా జరగనుంది.

ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు.

వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రికి కరోనా సోకిన ఇటలీ పర్యటకులు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామివారు శ్రీమహావిష్ణు అలంకారంలో గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వజ్ర వైఢూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధులో ఊరేగుతూ ధగధగ మెరిసిపోయారు. రాత్రి 7 గంటలకు బాలాలయంలో రథోత్సవం.. 8 గంటలకు కొండ కింద స్వామివారి ప్రచార రథం ఊరేగింపు వైభవంగా జరగనుంది.

ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు.

వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రికి కరోనా సోకిన ఇటలీ పర్యటకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.