యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డి పల్లి గ్రామ శివారులో టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. అందులో వెళ్తున్న 20 మందిలో ఆరుగురికి తీవ్ర గాయాలవ్వగా... మరో 14 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం గమనించిన స్థానికులు క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరంతా మేడ్చల్ జిల్లా ఉద్దేమర్రి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నిన్న జరిగిన పెళ్లి విందులో పాల్గొనేందుకు బీబీనగర్ మండలంలోని జైనపల్లికి బయలుదేరారు. బొమ్మల రామారం మండలంలోని మైసిరెడ్డిపల్లి వద్ద అదుపుతప్పి వాహనం బోల్తా కొట్టింది.
ఇవీ చూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో 11 కిలోల బంగారం సీజ్