వరంగల్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను బల్దియా కమిషనర్ పమేలా సత్పతి పరిశీలించారు. రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. నిబంధనలు పాటించని గుత్తేదారులను బ్లాక్ లిస్టులో చేర్చాలని అధికారులకు ఆదేశించారు.
ఓరుగల్లు నగరాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. స్మార్ట్ రోడ్ల పనులను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు.