ఆరునెలల్లోనే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వ్యాఖ్యానించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. శంకుస్థాపన చేసిన రోడ్డు పనులను రెండు రోజుల్లోనే పూర్తి చేసి జవాబుదారీగా ఉంటానని తెలిపారు. తన నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.