ETV Bharat / state

గ్రామసింహాల స్వైరవిహారం.. పదిమందికిపైగా గాయాలు

author img

By

Published : Oct 10, 2020, 4:08 PM IST

వరంగల్ అర్బన్ జిల్లాలో శునకాలు రెచ్చిపోయాయి. ఐనవోలు మండలం నందనం గ్రామంలో దాడి చేసి పదిమందికి పైగా గాయపర్చాయి. కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు సహా ఓ వృద్ధునికి తీవ్ర గాయాలయ్యాయి.

street dogs attack people in warangal urban dist
గ్రామసింహాల స్వైరవీహారం.. పదిమందికిపైగా గాయాలు

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామంలో శునకాలు స్వైరవీహారం చేశాయి. గ్రామంలోని వీధుల్లో పిల్లలతో సహా పెద్దవారిపై దాడి చేసి పదిమందికి పైగా గాయపర్చాయి. వారిలో ఓ ఐదేళ్ల బాలునితో పాటు వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు.

ఇదీ చూడండి; అక్రమంగా ఇసుక రవాణా.. ట్రాక్టర్లు స్వాధీనం

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామంలో శునకాలు స్వైరవీహారం చేశాయి. గ్రామంలోని వీధుల్లో పిల్లలతో సహా పెద్దవారిపై దాడి చేసి పదిమందికి పైగా గాయపర్చాయి. వారిలో ఓ ఐదేళ్ల బాలునితో పాటు వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు.

ఇదీ చూడండి; అక్రమంగా ఇసుక రవాణా.. ట్రాక్టర్లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.