ETV Bharat / state

Rush at Fish Markets on Mrigasira Karthi : మృగశిర కార్తె స్పెషల్.. చేపలకు మామూలుగా డిమాండ్ లేదుగా..!

author img

By

Published : Jun 8, 2023, 2:55 PM IST

Rush at Warangal Fish Markets : మృగశిర కార్తె వచ్చేసింది. ఈరోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పూర్వీకుల మాట. కార్తె రోజు చేపలు తినడం పూర్వ కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ కూడా. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపల మార్కెట్లల్లో రద్దీ వాతావరణం నెలకొంది. ఇక ఇదే అదనుగా భావించి కొందరు వ్యాపారులు అధిక ధరలకు చేపలు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది వినియోగదారులు.. దగ్గరలోని చెరువుల వద్దకు వెళ్తున్నారు. అక్కడే తాజాగా పట్టిన చేపలను కొనుగోలు చేస్తున్నారు. ధర కాస్త ఎక్కువైనా సరే.. తాజా చేపలైతే టేస్టీగా ఉంటాయని కేజీలకు కేజీలు కొనేస్తున్నారు.

Rush at Fish Markets on Mrigasira Karthi
Rush at Fish Markets on Mrigasira Karthi
మృగశిర కార్తె చేపల కొనుగోళ్లు మామూలుగా లేవుగా..!

Demand for Mrigasira Karthi fishes : ఇవాళ్టి నుంచి మృగశిర కార్తె ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ కార్తె తొలిరోజు చాలా స్పెషల్. ఈరోజున ప్రతి ఇంటా చేపల కూర ఘుమఘుమలు గుప్పుమంటాయి. చేపల ఫ్రై, చేపల పులుసు.. ఇలా రకరకాలుగా చేపల కూరను వండుకుని ఇంటిల్లిపాది కలిసి భోజనం చేస్తారు. చేపలంటే అంతగా ఇష్టం లేని వారు కూడా.. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయమని భావించి.. ఈరోజు ఓ చేప ముక్కను నోట్లో వేసుకుంటారు. ఇక ఈరోజు చేపల మార్కెట్​లలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. ఉదయం నుంచి పట్టణాల్లో అయితే చేపల మార్కెట్లలో.. పల్లెల్లో అయితే చెరువుల దగ్గరకు తండోపతండాలు జనసందోహమే.

Rush at Fish Markets on Mrigasira Karthi : మృగశిర కార్తె తొలిరోజు చేపలు తింటే ఆరోగ్యం బాగుంటుందని, వ్యాధులు దూరమవుతాయని ముఖ్యంగా ఆస్తమా రోగులకు ఈ రోజు చేపలు లేక చేపమందు తింటే రోగం పూర్తిగా నయమవుతుందని ప్రజల నమ్మకం. అందుకే మార్కెట్లు, రైతు బజార్లలో చేపల కోసం జనాలు క్యూ కడుతున్నారు. తమకు ఇష్టమైన చేపల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. చెరువుల వద్ద ఏటు చూసినా జన సందోహమే కాగా, కార్తెను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు పెద్దఎత్తున చేపలు తెప్పించి అమ్ముతున్నారు. మృగశిర కార్తె సందర్భంగా వరంగల్‌ జిల్లాలోని చేపల మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి.

కొంతమంది మార్కెట్​లో చేపలు కొనుగోలు చేయకుండా.. డైరెక్టుగా చెరువుల వద్దకే వెళ్తున్నారు. అక్కడైతే తాజా తాజాగా చెరువులో నుంచి తీసుకొచ్చిన చేపలు అమ్ముతారని చాలా మంది అక్కడికే క్యూ కడుతున్నారు. వరంగల్ జిల్లాలోని పలు చెరువుల వద్ద మత్స్యకారులు చేపలు పట్టి పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు.

చెరువులో నుంచి చేపలు ఒడ్డుకొచ్చాయో లేదో ఒకరిని ఒక్కరు తోసుకుంటబ నాకు కావాలంటే నాకు కావాలంటూ వ్యాపారుల చుట్టు గుమిగుడుతున్నారు. మార్కెట్​లో మాములు రోజుల్లో రవ్వలు, బంగారు తీగలు కిలో రూ.130 విక్రయించే వ్యాపారులు నేడు డిమాండ్​ బాగా ఉంటుందని తెలిసి రూ.200 అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అదే నల్ల చేప అయితే రూ.400ల చొప్పున అమ్ముతున్నారు. చెరువు దగ్గరికి వెళ్తే రూ.130 నుంచి రూ.150 కిలో చేపల లభ్యమవుతుండడంతో జనం చెరువుల దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకుని చేపలను కొనుగోలు చేస్తున్నారు.

ఈ రోజున ప్రతి ఒక్కరూ చేపలు తినడం , చేప మందులు తినడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఈ కార్తెలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల చాలా మంది అనారోగ్యం బారిన పడుతుంటారు. ముఖ్యంగా గుండె జబ్బు, అస్తమా బాధితులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే ముప్పు ఉంటుంది. చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని భావించి మృగశిర కార్తె రోజు ఈ ఆనవాయితీ పాటిస్తుంటారు.

ఇవీ చదవండి:

మృగశిర కార్తె చేపల కొనుగోళ్లు మామూలుగా లేవుగా..!

Demand for Mrigasira Karthi fishes : ఇవాళ్టి నుంచి మృగశిర కార్తె ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ కార్తె తొలిరోజు చాలా స్పెషల్. ఈరోజున ప్రతి ఇంటా చేపల కూర ఘుమఘుమలు గుప్పుమంటాయి. చేపల ఫ్రై, చేపల పులుసు.. ఇలా రకరకాలుగా చేపల కూరను వండుకుని ఇంటిల్లిపాది కలిసి భోజనం చేస్తారు. చేపలంటే అంతగా ఇష్టం లేని వారు కూడా.. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయమని భావించి.. ఈరోజు ఓ చేప ముక్కను నోట్లో వేసుకుంటారు. ఇక ఈరోజు చేపల మార్కెట్​లలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. ఉదయం నుంచి పట్టణాల్లో అయితే చేపల మార్కెట్లలో.. పల్లెల్లో అయితే చెరువుల దగ్గరకు తండోపతండాలు జనసందోహమే.

Rush at Fish Markets on Mrigasira Karthi : మృగశిర కార్తె తొలిరోజు చేపలు తింటే ఆరోగ్యం బాగుంటుందని, వ్యాధులు దూరమవుతాయని ముఖ్యంగా ఆస్తమా రోగులకు ఈ రోజు చేపలు లేక చేపమందు తింటే రోగం పూర్తిగా నయమవుతుందని ప్రజల నమ్మకం. అందుకే మార్కెట్లు, రైతు బజార్లలో చేపల కోసం జనాలు క్యూ కడుతున్నారు. తమకు ఇష్టమైన చేపల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. చెరువుల వద్ద ఏటు చూసినా జన సందోహమే కాగా, కార్తెను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు పెద్దఎత్తున చేపలు తెప్పించి అమ్ముతున్నారు. మృగశిర కార్తె సందర్భంగా వరంగల్‌ జిల్లాలోని చేపల మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి.

కొంతమంది మార్కెట్​లో చేపలు కొనుగోలు చేయకుండా.. డైరెక్టుగా చెరువుల వద్దకే వెళ్తున్నారు. అక్కడైతే తాజా తాజాగా చెరువులో నుంచి తీసుకొచ్చిన చేపలు అమ్ముతారని చాలా మంది అక్కడికే క్యూ కడుతున్నారు. వరంగల్ జిల్లాలోని పలు చెరువుల వద్ద మత్స్యకారులు చేపలు పట్టి పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు.

చెరువులో నుంచి చేపలు ఒడ్డుకొచ్చాయో లేదో ఒకరిని ఒక్కరు తోసుకుంటబ నాకు కావాలంటే నాకు కావాలంటూ వ్యాపారుల చుట్టు గుమిగుడుతున్నారు. మార్కెట్​లో మాములు రోజుల్లో రవ్వలు, బంగారు తీగలు కిలో రూ.130 విక్రయించే వ్యాపారులు నేడు డిమాండ్​ బాగా ఉంటుందని తెలిసి రూ.200 అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అదే నల్ల చేప అయితే రూ.400ల చొప్పున అమ్ముతున్నారు. చెరువు దగ్గరికి వెళ్తే రూ.130 నుంచి రూ.150 కిలో చేపల లభ్యమవుతుండడంతో జనం చెరువుల దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకుని చేపలను కొనుగోలు చేస్తున్నారు.

ఈ రోజున ప్రతి ఒక్కరూ చేపలు తినడం , చేప మందులు తినడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఈ కార్తెలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల చాలా మంది అనారోగ్యం బారిన పడుతుంటారు. ముఖ్యంగా గుండె జబ్బు, అస్తమా బాధితులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే ముప్పు ఉంటుంది. చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని భావించి మృగశిర కార్తె రోజు ఈ ఆనవాయితీ పాటిస్తుంటారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.