వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని పలు కాలనీల్లో వరద కొనసాగుతోంది. శివనగర్ మైసయ్య నగర్ ప్రాంతాల్లో వరంగల్ రాతికోట దిగువన ఉన్న అగర్తలా ఉప్పొంగి ప్రవహిస్తుండటం వల్ల కాలనీల్లో వరద ఉద్ధృతమవుతోంది.
అత్యవసర పరిస్థితిల్లో తప్ప శివనగర్ వాసులు రోడ్డు ఎక్కట్లేదు. గత ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో నగరంలోని పలు కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. సోమవారంతో పోలిస్తే నగరంలో పలుచోట్ల కొంత వరద ప్రవాహం తగ్గింది. కట్ట మల్లన్న చెరువు మత్తడి పోవడం వల్ల లక్ష్మీ గణపతి కాలనీ మధురా నగర్ ఇంకా జల దిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి.
ఇవీ చూడండి : ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసిన సీపీ అంజనీకుమార్