ETV Bharat / state

కరోనా చికిత్సను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలి: మందకృష్ణ

author img

By

Published : Aug 13, 2020, 6:12 PM IST

కరోనా చికిత్సను ప్రభుత్వం వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్​ చేశారు. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

mandakrishna madiga comments on trs government
కరోనా చికిత్సను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలి: మందకృష్ణ

తెలంగాణ ప్రభుత్వం తక్షణమే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోటు బడ్జెట్​లో ఉన్న ఏపీ రాష్ట్రం కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చితే... మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్టం కరోనాను ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చడం లేదని ఆయన ప్రశ్నించారు.

పేద ప్రజలు ఆరోగ్యం పట్ల భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. తెరాస ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్... ఎస్సీలను ఏ మాత్రం లెక్క చేయడం లేదని తెలిపారు.

కరోనా చికిత్సను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలి: మందకృష్ణ
ఇవీ చూడండి: అమానవీయం: రాత్రంతా వర్షంలోనే కరోనా రోగి మృతదేహం

తెలంగాణ ప్రభుత్వం తక్షణమే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోటు బడ్జెట్​లో ఉన్న ఏపీ రాష్ట్రం కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చితే... మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్టం కరోనాను ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చడం లేదని ఆయన ప్రశ్నించారు.

పేద ప్రజలు ఆరోగ్యం పట్ల భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. తెరాస ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్... ఎస్సీలను ఏ మాత్రం లెక్క చేయడం లేదని తెలిపారు.

కరోనా చికిత్సను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలి: మందకృష్ణ
ఇవీ చూడండి: అమానవీయం: రాత్రంతా వర్షంలోనే కరోనా రోగి మృతదేహం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.