ETV Bharat / state

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి: రోడ్డు గుత్తేదారు - నాసిరకం రోడ్లపై మడికొండ గ్రామస్థుల ఆందోళన

తమ గ్రామంలోని ప్రధాన రహదారి పనులు నాసిరకంగా జరుగుతున్నాయని వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామస్థులు గుత్తేదారుని నిలదీశారు. అతను దురుసుగా ప్రవర్తించడం వల్ల ఆందోళనకు దిగారు.

madikonda villagers protest in warangal against contractor who is constructing qualityless roads
నాసిరకం రోడ్లపై మడికొండ గ్రామస్థుల ఆందోళన
author img

By

Published : Dec 26, 2019, 7:44 PM IST

నాసిరకం రోడ్లపై మడికొండ గ్రామస్థుల ఆందోళన

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట మండలం మడికొండ నుంచి ధర్మసాగర్​ వైపునకు ప్రధాన రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోలింగ్​ తర్వాత.. డాంబర్​ మందం రోడ్డుకు ఒక ఇంచుకు పైగా ఉండాలని, కానీ అరఇంచు మాత్రమే ఉండటం గమనించిన గ్రామస్థులు గుత్తేదారుని నిలదీశారు.

నిబంధనల ప్రకారం నాణ్యమైన రోడ్డు వేయకపోతే అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించగా.. గుత్తేదారు వారితో దురుసుగా ప్రవర్తించాడని గ్రామస్థులు తెలిపారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడని వెల్లడించారు.

గుత్తేదారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మడికొండ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకుని సంఘటనాస్థలికి చేరుకున్న ఆర్​అండ్​బీ జేఈ రోడ్డును పరిశీలించారు. తక్కువ మందం ఉన్న చోట మళ్లీ డాంబర్​ వేసేలా చర్యలు తీసుకున్నారు. నాణ్యతతో రహదారి నిర్మాణం జరగాలని గుత్తేదారుని ఆదేశించారు.

నాసిరకం రోడ్లపై మడికొండ గ్రామస్థుల ఆందోళన

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట మండలం మడికొండ నుంచి ధర్మసాగర్​ వైపునకు ప్రధాన రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోలింగ్​ తర్వాత.. డాంబర్​ మందం రోడ్డుకు ఒక ఇంచుకు పైగా ఉండాలని, కానీ అరఇంచు మాత్రమే ఉండటం గమనించిన గ్రామస్థులు గుత్తేదారుని నిలదీశారు.

నిబంధనల ప్రకారం నాణ్యమైన రోడ్డు వేయకపోతే అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించగా.. గుత్తేదారు వారితో దురుసుగా ప్రవర్తించాడని గ్రామస్థులు తెలిపారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడని వెల్లడించారు.

గుత్తేదారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మడికొండ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకుని సంఘటనాస్థలికి చేరుకున్న ఆర్​అండ్​బీ జేఈ రోడ్డును పరిశీలించారు. తక్కువ మందం ఉన్న చోట మళ్లీ డాంబర్​ వేసేలా చర్యలు తీసుకున్నారు. నాణ్యతతో రహదారి నిర్మాణం జరగాలని గుత్తేదారుని ఆదేశించారు.

Intro:TG_WGL_11_26_NAASI_RAKAM_RODDU_PAI_ANDOLANA_V.O_TS10132

CONTEIBUTER : D, VENU KAZIPET DIVISION


( ) తమ గ్రామంలోని ప్రధాన రహదారి పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ఆరోపిస్తూ వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేట మండలం మడికొండ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మడికొండ నుండి ధర్మసాగర్ వైపునకు ఉన్న ప్రధాన రహదారి యొక్క విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గుత్తేదారు పోసిన రోడ్డు...... రోలింగ్ జరిగిన తర్వాత ఒక ఇంచు పైగా ఉండాలి. కానీ రోలర్ తో రోలింగ్ చేసిన తర్వాత అక్కడక్కడ దాని మందం అర ఇంచు మాత్రమే ఉందని గ్రామస్తులు గుత్తేదారు నిలదీశారు. రోడ్డుని నిబంధనల మేరకు వేయకపోతే అధికారులకు ఫిర్యాదు చేస్తామని గుత్తేదారు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు నిలదీయడంతో గుత్తేదారు కూడా వారితో దురుసుగా ప్రవర్తించాడు. ఎవరికి చెప్పకుంటారో చెప్పుకోండి అని తెగేసి చెప్పాడని స్థానికులు తెలిపారు. గుత్తేదారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో..... స్థానికులు సైతం అతని పై ఆగ్రహం తెలుపుతూ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో రహదారి పనులు గంటకుపైగా స్తంభించిపోయాయి. వెంటనే అక్కడికి చేరుకున్న ఆర్.అండ్.బి జేఈ రోడ్డును పరిశీలించి తక్కువ మందం ఉన్న చోట రోడ్డుపై మళ్లీ డాంబర్ వేసేలా చర్యలు తీసుకున్నారు. స్థానికులకు సమాధానం చెప్పి రోడ్డు నిర్మాణ పనులను మొదలు పెట్టించారు.


Body:CONTEIBUTER : D, VENU KAZIPET DIVISION


Conclusion:9000417593

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.