వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నిమిషం నిబంధన ఉండటంతో విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్... మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు రెండో సెషన్ పరీక్ష జరగనుంది. 6రోజుల పాటు జరిగే పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
వరంగల్, హన్మకొండ, నర్సంపేటలో 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7,183 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు మాస్కులను అందించి లోపలికి పంపించారు. జ్వరం, తదితర సమస్యలు ఉన్నవారికి ప్రత్యేక గదులు కేటాయించారు.