ETV Bharat / state

'ఒకే చితిపై 4 మృతదేహాలు కాల్చారంటూ.. వచ్చిన వార్తలు అవాస్తవం' - corona deadbodies news

నాలుగు మృతదేహాలూ ఒకే చితిపై కాల్చారంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఒకే సమయంలో దహన కార్యక్రమాలు నిర్వహించారు తప్ప... ఒకే చితిపై కాదంటున్న పమేలా సత్పతితో ఈటీవీ భారత్​ ముఖాముఖి....

Interview with Greater Warangal Commissioner Pamela Satpathy
'ఒకే చితిపై 4 మృతదేహాలు కాల్చారంటూ.. వచ్చిన వార్తలు అవాస్తవం'
author img

By

Published : Jul 30, 2020, 5:28 PM IST

కరోనా మృతదేహాల దహనసంస్కారాలకు అడుగడునా అడ్డంకులు ఏర్పడుతున్న తరుణంలో గ్రేటర్​ వరంగల్​ అధికారులు... ఇందుకోసం 12 మందితో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతులను తరలించేందుకు... ప్రత్యేకంగా అంబులెన్స్​ను సిద్ధం చేశారు.

గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి ముఖాముఖి

దహనం లేదా ఖననం మొదట్నుంచి చివరి వరకూ.... బృందం సభ్యులు పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి... వారి వారి మతాచారాలకు అనుగుణంగానే కొవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తామని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి చెప్పారు.

నాలుగు మృతదేహాలూ ఒకే చితిపై కాల్చారంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ఒకే సమయంలో దహన కార్యక్రమాలు నిర్వహించారు తప్ప... ఒకే చితిపై కాదని తెలిపారు. శ్మశానవాటికకు సమీపంలోని ప్రజలు కూడా భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని... అన్ని జాగ్రత్తలు తీసుకుని.. అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇదీ చూడండి: అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు

కరోనా మృతదేహాల దహనసంస్కారాలకు అడుగడునా అడ్డంకులు ఏర్పడుతున్న తరుణంలో గ్రేటర్​ వరంగల్​ అధికారులు... ఇందుకోసం 12 మందితో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతులను తరలించేందుకు... ప్రత్యేకంగా అంబులెన్స్​ను సిద్ధం చేశారు.

గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి ముఖాముఖి

దహనం లేదా ఖననం మొదట్నుంచి చివరి వరకూ.... బృందం సభ్యులు పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి... వారి వారి మతాచారాలకు అనుగుణంగానే కొవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తామని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి చెప్పారు.

నాలుగు మృతదేహాలూ ఒకే చితిపై కాల్చారంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ఒకే సమయంలో దహన కార్యక్రమాలు నిర్వహించారు తప్ప... ఒకే చితిపై కాదని తెలిపారు. శ్మశానవాటికకు సమీపంలోని ప్రజలు కూడా భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని... అన్ని జాగ్రత్తలు తీసుకుని.. అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇదీ చూడండి: అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.