వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరంగల్ జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయభాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్ హాజరై నిరుపేద గీత కార్మికుల కుటుంబాలకు సరుకులు అందజేశారు.
లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న గీత కార్మికులను దృష్టిలో పెట్టుకొని గౌడ సంఘం సరుకులను పంపిణీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యేలు కొనియాడారు. ఇలాంటి విపత్కర సమయంలో దాతలు ముందుకొచ్చి నిరుపేదలను ఆదుకోవాలని సూచించారు.