ETV Bharat / state

'సోమేష్​తో జిల్లా పాలనాధికారుల సమావేశం'

author img

By

Published : Aug 28, 2019, 5:01 AM IST

Updated : Aug 28, 2019, 8:39 AM IST

రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించారు. బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మంగళవారం వరంగల్​లో బసచేశారు. అనంతరం హన్మకొండలోని హోటల్ హరితలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్​తో సమావేశమయ్యారు.

కలెక్టర్లతో సమావేశమైన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్​

మంగళవారం మధ్యాహ్నం వరంగల్ జిల్లాలో అన్ని జిల్లాల కలెక్టర్లు పర్యటించారు. అనంతరం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్​తో భేటీ అయ్యారు. గత వారం సీఎం కేసీఆర్ పాలనాధికారులతో నిర్వహించిన సమావేశానికి కొనసాగింపుగానే హన్మకొండలోని హోటల్ హరితలో సోమేష్​తో సమావేశమయ్యారు. కొత్త రెవెన్యూ చట్టంలో మార్పులు, ముసాయిదా రూపకల్పనపై నూతన చట్టం తెచ్చేందుకు కసరత్తు చేస్తున్న క్రమంలో కలెక్టర్ల పాత్ర కీలకమని సోమేశ్‌ కుమార్ పేర్కొన్నారు.

కలెక్టర్లతో సమావేశమైన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్​

'భూప్రక్షాళనకు కలెక్టర్లు మరింత వేగంగా పనిచేయాలి'

కొత్త రెవెన్యూ చట్టంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలన్న అంశంపై కలెక్టర్ల సలహాలు, సూచనలను సోమేశ్​ కుమార్​ తీసుకున్నారు. త్వరలో దీనిపై నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తోందన్నారు. ప్రభుత్వం భూప్రక్షాళనకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్న సోమేశ్​ కుమార్​.. పాలనాధికారులు మరింత వేగంతో కృషి చేయాలని ఆదేశించారు.

ఇవీ చూడండి : ప్రభుత్వం ఇచ్చిన 25హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదు

మంగళవారం మధ్యాహ్నం వరంగల్ జిల్లాలో అన్ని జిల్లాల కలెక్టర్లు పర్యటించారు. అనంతరం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్​తో భేటీ అయ్యారు. గత వారం సీఎం కేసీఆర్ పాలనాధికారులతో నిర్వహించిన సమావేశానికి కొనసాగింపుగానే హన్మకొండలోని హోటల్ హరితలో సోమేష్​తో సమావేశమయ్యారు. కొత్త రెవెన్యూ చట్టంలో మార్పులు, ముసాయిదా రూపకల్పనపై నూతన చట్టం తెచ్చేందుకు కసరత్తు చేస్తున్న క్రమంలో కలెక్టర్ల పాత్ర కీలకమని సోమేశ్‌ కుమార్ పేర్కొన్నారు.

కలెక్టర్లతో సమావేశమైన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్​

'భూప్రక్షాళనకు కలెక్టర్లు మరింత వేగంగా పనిచేయాలి'

కొత్త రెవెన్యూ చట్టంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలన్న అంశంపై కలెక్టర్ల సలహాలు, సూచనలను సోమేశ్​ కుమార్​ తీసుకున్నారు. త్వరలో దీనిపై నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తోందన్నారు. ప్రభుత్వం భూప్రక్షాళనకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్న సోమేశ్​ కుమార్​.. పాలనాధికారులు మరింత వేగంతో కృషి చేయాలని ఆదేశించారు.

ఇవీ చూడండి : ప్రభుత్వం ఇచ్చిన 25హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదు

TG_Hyd_09_28_Financial_Descipline_Pkg_3053262 From : Raghu Vardhan ( )రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి సారించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో రాష్ట్రంలోనూ అన్ని దశలు, స్థాయిలో పక్కా ప్రణాళికతో క్రమశిక్షణ అమలు కానుంది. పూర్తి స్థాయి బడ్జెట్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా అంతకు ముందే మంత్రులు, ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు...LOOK V.O - ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దమవుతోంది. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో బడ్జెట్ ఉభయసభల ముందుకు రానుంది. అందుకు అనుగుణంగా బడ్జెట్ కసరత్తు సాగుతోంది. కసరత్తు ప్రధానంగా ఆర్థిక మాంద్యం చుట్టే తిరుగుతోంది. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొని దాని ప్రభావం అన్ని రంగాలపై పడడంతో ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలోనూ అంతే. రాష్ట్రానికి వివిధ రూపాల్లో రావాల్సిన ఆదాయం తగ్గింది. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, గ్రాంట్లు కూడా తగ్గాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు, వాస్తవ పరిస్థితులకు అంతరం ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఐదు నెలలు గడిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమైన రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకుంటోంది. బడ్జెట్ కసరత్తులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక మాంద్యం ప్రభావంపైనే దృష్టి సారించారు. దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా అన్ని ప్రభుత్వ శాఖలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. బడ్జెట్ తయారీ మొదలు నిధుల సద్వినియోగం వరకు ప్రతీ దశలోనూ పూర్తి స్థాయి క్రమశిక్షణ, ప్రణాళిక అవసరమని ఆయానున్నారు. అటు బడ్జెట్ కంటే ముందే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులకు వివరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం కంటే ముందే మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో సీఎం కేసీఆర్ సమావేశమై ఆర్థిక పరిస్థితిని వివరించడంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ పాటించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విడమరిచి చెప్పనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విస్తృతంగా చర్చించి ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వాస్తవ పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించేలా ఆయా శాఖలకు సరైన మార్గదర్శకం చేయాలని భావిస్తున్నారు. ఆర్థిక మాంద్యం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే బడ్జెట్ కేటాయింపులు ఉండనున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు చేస్తూ ఇప్పటికే కొనసాగుతున్న కార్యక్రమాల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పూర్తి నియంత్రణతో ఆర్థిక క్రమశిక్షణను అమలు చేయనున్నారు.
Last Updated : Aug 28, 2019, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.