ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలతో పాటు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించారు. సాయంత్రం సర్వభూపాల సేవ నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తెల్లవారుజాము నుంచే బారులు తీరారు.
ఇవీ చూడండి: స్వర్ణరథం, అశ్వవాహనం... శ్రీవారి కల్కి అవతారం దర్శనం