ETV Bharat / state

ఆన్​లైన్​ తరగతులను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ నాయకుల ఆందోళన

ఆన్​లైన్​ తరగతులను వ్యతిరేకిస్తూ వరంగల్​ నగరంలో ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఆన్​లైన్​ తరగతుల పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.

author img

By

Published : Jul 2, 2020, 1:12 PM IST

abvp leaders protest against to online classes in warangal
ఆన్​లైన్​ తరగతులను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ నాయకుల ఆందోళన

వరంగల్ నగరంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. హన్మకొండలోని అంబేడ్కర్​ కూడలి వద్ద ఆన్​లైన్​ తరగతులను వ్యతిరేకిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా ధర్నా చేపట్టారు. కరోనా కష్టకాలంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్​లైన్​ తరగతుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజులు చెల్లించాలని ఒత్తిడికి గురి చేస్తున్నాయని ఆరోపించారు.

ఆన్​లైన్​ తరగతుల వల్ల చిన్నారుల కంటి చూపు మందగించడంతో పాటు అనేక ఇతర సమస్యలు వస్తాయని తెలిపారు. పిల్లల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: కాకతీయ వైద్య కళాశాలలో కరోనా పరీక్షలు

వరంగల్ నగరంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. హన్మకొండలోని అంబేడ్కర్​ కూడలి వద్ద ఆన్​లైన్​ తరగతులను వ్యతిరేకిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా ధర్నా చేపట్టారు. కరోనా కష్టకాలంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్​లైన్​ తరగతుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజులు చెల్లించాలని ఒత్తిడికి గురి చేస్తున్నాయని ఆరోపించారు.

ఆన్​లైన్​ తరగతుల వల్ల చిన్నారుల కంటి చూపు మందగించడంతో పాటు అనేక ఇతర సమస్యలు వస్తాయని తెలిపారు. పిల్లల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: కాకతీయ వైద్య కళాశాలలో కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.