ETV Bharat / state

కలుపు మొక్కల నుంచి విముక్తి పొంది... రైతులు లాభపడేలా - మల్చింగ్ పద్ధతిలో సాగు వార్తలు

కలుపును నివారించేందుకు రైతన్నలు కొత్తపంథాలో అడుగులేస్తున్నారు. కూలీల కొరతను తట్టుకునేలా.. శాస్త్రీయతను అవలంభిస్తూ ముందుకు సాగుతున్నారు. వ్యవసాయంలో మూసపద్ధతులకు స్వస్తి పలికి నూతన సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. కలుపు కష్టాలకు స్వస్తి పలికి... మల్చింగ్ సాగులో రాణిస్తున్న రైతులపై ప్రత్యేక కథనం.

warangal farmers using mulching technique for profits
కలుపు మొక్కల నుంచి విముక్తి పొంది... రైతులు లాభపడేలా
author img

By

Published : Sep 22, 2020, 2:13 PM IST

ఎలాంటి పంటలు సాగుచేయాలన్నా ప్రతీ రైతుకు ఎదురయ్యే ప్రధాన సమస్య కలుపు. పూత నుంచి కోత దశ వరకు కలుపు వల్ల వచ్చే ఖర్చు రైతులకు పెనుభారంగా మారింది. ఈ నేపథ్యంలో వరంగల్ గ్రామీణ జిల్లా రైతులు కొత్త పంథాలో వ్యవసాయం ప్రారంభించారు. కలుపు సమస్యను నివారించేందుకు మల్చింగ్ విధనాన్ని అవలంభిస్తున్నారు. సకాలంలో కూలీలు దొరకక... దొరికినా ఎక్కువ మొత్తంలో కూలీ డబ్బులు వెచ్చించడంలో విసిగి వేసారిపోయిన రైతన్నలు... ఇలా మల్చింగ్ సేద్యంతో ఖర్చులను తగ్గించుకుంటూ మేలైన వ్యవసాయం చేస్తున్నారు.

వరంగల్​కు చెందిన బుచ్చిరెడ్డి అనే రైతు... తనకున్న 2 ఎకరాల్లో మిరప సాగు చేపట్టారు. ఉద్యానవన అధికారుల సలహాలు, సూచనల మేరకు మల్చింగ్ విధానంలో సాగుకు సిద్ధమై పంట వేశారు. మల్చింగ్​తో కలుపు సమస్య తలెత్తదన్న అధికారుల సూచనలతో సాగు ప్రారంభించారు.

అనుకున్న దానికంటే ఎక్కవగా మిరప సాగులో ఆయన రాణించారు. కలుపు రహిత సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచాడు. దాదాపు 35 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న ఆయన... ఇంత వరకు ఇలాటి సాగు చేయలేదని అధికారుల సలహా వల్లే... మల్చింగ్ సాగు చేపట్టానని అంటున్నారు. ఈ పద్ధతి ద్వారా ఖర్చు తగ్గి... మంచి దిగుబడులు పొందవచ్చని తెలిపారు. సాగుకు ఖర్చయ్యే మొత్తంలో 20 శాతం డబ్బులు మల్చింగ్ సాగుకు ఖర్చు చేస్తే... ఆ తర్వాత పంట లాభలు రైతు సొంతమని చెబుతున్నారు.

ఇదీ చూడండి: పంటను రక్షించుకోవడం కోసం కాడెడ్లైన దంపతులు

ఎలాంటి పంటలు సాగుచేయాలన్నా ప్రతీ రైతుకు ఎదురయ్యే ప్రధాన సమస్య కలుపు. పూత నుంచి కోత దశ వరకు కలుపు వల్ల వచ్చే ఖర్చు రైతులకు పెనుభారంగా మారింది. ఈ నేపథ్యంలో వరంగల్ గ్రామీణ జిల్లా రైతులు కొత్త పంథాలో వ్యవసాయం ప్రారంభించారు. కలుపు సమస్యను నివారించేందుకు మల్చింగ్ విధనాన్ని అవలంభిస్తున్నారు. సకాలంలో కూలీలు దొరకక... దొరికినా ఎక్కువ మొత్తంలో కూలీ డబ్బులు వెచ్చించడంలో విసిగి వేసారిపోయిన రైతన్నలు... ఇలా మల్చింగ్ సేద్యంతో ఖర్చులను తగ్గించుకుంటూ మేలైన వ్యవసాయం చేస్తున్నారు.

వరంగల్​కు చెందిన బుచ్చిరెడ్డి అనే రైతు... తనకున్న 2 ఎకరాల్లో మిరప సాగు చేపట్టారు. ఉద్యానవన అధికారుల సలహాలు, సూచనల మేరకు మల్చింగ్ విధానంలో సాగుకు సిద్ధమై పంట వేశారు. మల్చింగ్​తో కలుపు సమస్య తలెత్తదన్న అధికారుల సూచనలతో సాగు ప్రారంభించారు.

అనుకున్న దానికంటే ఎక్కవగా మిరప సాగులో ఆయన రాణించారు. కలుపు రహిత సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచాడు. దాదాపు 35 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న ఆయన... ఇంత వరకు ఇలాటి సాగు చేయలేదని అధికారుల సలహా వల్లే... మల్చింగ్ సాగు చేపట్టానని అంటున్నారు. ఈ పద్ధతి ద్వారా ఖర్చు తగ్గి... మంచి దిగుబడులు పొందవచ్చని తెలిపారు. సాగుకు ఖర్చయ్యే మొత్తంలో 20 శాతం డబ్బులు మల్చింగ్ సాగుకు ఖర్చు చేస్తే... ఆ తర్వాత పంట లాభలు రైతు సొంతమని చెబుతున్నారు.

ఇదీ చూడండి: పంటను రక్షించుకోవడం కోసం కాడెడ్లైన దంపతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.