వరంగల్ రూరల్ జిల్లా ఇల్లందు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్హెచ్ 563 వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడింది. రెండు కాళ్లు నుజ్జునుజ్జు కాగా.. మరో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి లారీ అతివేగమే కారణంగా స్థానికులు తెలిపారు.
ఇవీ చూడండి: నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష