ఎండిపోతున్న మొక్కలకు నీళ్లు పట్టి మొక్కల పట్ల ప్రేమను నిరూపించుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ రూరల్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రికి సంగెం మండలం తీగరాజుపల్లిలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఎండినట్లు కనిపించాయి. వెంటనే కాన్వాయ్ ఆపి మరి ఆ మొక్కలకు నీళ్లు పోశారు.
భవిష్యత్ తరాలకు మెరుగైన వతవరణాన్ని అందించడానికి పెట్టిన మొక్కలు ఇలా ఎండిపోవడాన్ని చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కలు నాటగానే కాదని... వాటి సంరక్షణ అందరి బాధ్యతని గుర్తు చేశారు. ఇకపై ఎండిన మొక్కలు కనిపిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.