వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక గ్రామ శివారులోని కేఎన్ఆర్ రైస్మిల్లులో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్సు అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించామని అధికారులు తెలిపారు. 100 క్వింటాళ్లకు పైగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
రైస్మిల్లు యజమాని కొందరు అక్రమార్కులతో కలిసి పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని దొంగచాటుగా మిల్లులో డంపు చేశారని చెప్పారు. రైస్ మిల్లు యజమాని సహా పలువురు వ్యక్తులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు.