ETV Bharat / state

ధాన్యం కొనుగోళ్లు చేయాలంటూ అశోక్​నగర్​లో రైతుల రాస్తారోకో

ధాన్యంలో తరుగు తీయకుండా కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ వరంగల్​ గ్రామీణ జిల్లాలో రైతులు రాస్తారోకో చేపట్టారు. పదిహేను రోజులుగా ధాన్యం లోడుతో కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

author img

By

Published : Dec 1, 2020, 4:43 PM IST

farmers strike in ashok nagar warangal rural district
ధాన్యం కొనుగోళ్లు చేయాలంటూ అశోక్​నగర్​లో రైతుల రాస్తారోకో

ఎలాంటి తరుగు లేకుండా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్​లో రైతులు రాస్తారోకో చేశారు. పదిహేను రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు వచ్చి తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు.

రెండు గంటల పాటు జరిగిన రాస్తారోకోతో కొత్తగూడ-నర్సంపేట మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నర్సంపేట ఆర్డీఓ పవన్ కుమార్ వచ్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తారని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఎలాంటి తరుగు లేకుండా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్​లో రైతులు రాస్తారోకో చేశారు. పదిహేను రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు వచ్చి తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు.

రెండు గంటల పాటు జరిగిన రాస్తారోకోతో కొత్తగూడ-నర్సంపేట మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నర్సంపేట ఆర్డీఓ పవన్ కుమార్ వచ్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తారని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి: ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.