వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో వరద ఉద్ధృతికి నష్టపోయిన పంటలను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. పంటల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు సాయం అందేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
కోనారెడ్డి చెరువు ఆయకట్టు సహా... కట్ట క్రింది భాగం వరద ప్రవాహానికి రేగడి పొలంలో... నాపరాళ్ళు తేలి బోడుగా మారాయి. దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా వరి పంట... పూర్తి స్థాయిలో కొట్టుకుపోయిందని అధికారులు గుర్తించారు. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం త్వరగా ఇప్పించే ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: యాక్టివ్ కేసుల కన్నా 3 రెట్లు అధికంగా రికవరీలు