ETV Bharat / state

యాపర్లలో పర్యటించిన కలెక్టర్​ శ్వేతా మహంతి - latest news on collector Shweta Mahanthi

పల్లెప్రగతిలో భాగంగా వనపర్తి జిల్లాలోని యాపర్లలో జిల్లా పాలనాధికారి శ్వేతా మహంతి పర్యటించారు. అనంతరం పల్లెప్రగతిపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని, గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

collector Shweta Mahanthi toured Yaperla
యాపర్లలో పర్యటించిన కలెక్టర్​ శ్వేతా మహంతి
author img

By

Published : Jan 5, 2020, 12:33 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్లలో జిల్లా కలెక్టర్​ శ్వేతా మహంతి పర్యటించారు. వీధుల్లో తిరిగి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. మొదటి విడతలో చేపట్టిన కార్యక్రమాలు, రెండో విడతలో చేపట్టనున్న కార్యక్రమాలపై గ్రామ సర్పంచ్​, కార్యదర్శులను ఆరా తీశారు.

గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మాణం, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, పన్ను చెల్లింపులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డును పరిశీలించి, పూర్తి ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. మిషన్​ భగీరథ పనుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ మిషన్​ భగీరథ అసిస్టెంట్​ ఇంజినీర్​కు షోకాజ్​ నోటీసు జారీచేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం గ్రామ శివారులో శ్మశాన వాటిక నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు.

యాపర్లలో పర్యటించిన కలెక్టర్​ శ్వేతా మహంతి

ఇదీ చూడండి:నెలాఖరులో పార్లమెంటు బడ్జెట్​ సమావేశాలు?

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్లలో జిల్లా కలెక్టర్​ శ్వేతా మహంతి పర్యటించారు. వీధుల్లో తిరిగి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. మొదటి విడతలో చేపట్టిన కార్యక్రమాలు, రెండో విడతలో చేపట్టనున్న కార్యక్రమాలపై గ్రామ సర్పంచ్​, కార్యదర్శులను ఆరా తీశారు.

గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మాణం, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, పన్ను చెల్లింపులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డును పరిశీలించి, పూర్తి ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. మిషన్​ భగీరథ పనుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ మిషన్​ భగీరథ అసిస్టెంట్​ ఇంజినీర్​కు షోకాజ్​ నోటీసు జారీచేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం గ్రామ శివారులో శ్మశాన వాటిక నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు.

యాపర్లలో పర్యటించిన కలెక్టర్​ శ్వేతా మహంతి

ఇదీ చూడండి:నెలాఖరులో పార్లమెంటు బడ్జెట్​ సమావేశాలు?

Intro:tg_mbnr_02_04_collector_palle_pragathi_vo_avb_ts10053
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్ల గ్రామంలో తాగునీటి ట్యాంకుల ద్వారా మిషన్ భగీరథ పైప్ లైన్లకు కనెక్షన్లు ఇవ్వటంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను మిషన్ భగీరథ అసిస్టెంట్ ఇంజనీర్ లకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశించారు.
రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె పెబ్బేరు మండలం యాపర్ల గ్రామంలో పర్యటించారు. ముందుగా గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ద్వారా మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన కార్యక్రమాలు, రెండవ విడత చేపట్టనున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మాణం, స్మశాన వాటిక, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం, చెల్లింపులు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం అన్ని అంశాలపై అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ డంపింగ్ యార్డును పరిశీలించి, పూర్తి ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. అంతేకాక గ్రామంలో కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దహన వాటిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.Body:tg_mbnr_02_04_collector_palle_pragathi_vo_avb_ts10053Conclusion:tg_mbnr_02_04_collector_palle_pragathi_vo_avb_ts10053

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.