అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కొత్తకోటలో అగ్నిమాపక అధికారులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. క్షేత్ర స్థాయిలో విద్యార్థినుల చేత మంటలను ఆర్పించి తర్ఫీదు ఇచ్చారు. అనుకోకుండా జరిగే ప్రమాదాలకు భయపడకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మాలతి, ఉపాధ్యాయినిలు, విద్యార్థినిలు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి : 'తుది తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీ ఎన్నిక జరపొద్దు'