సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం ఐకేపీ కేంద్రంపై జిల్లా తూనికలు, కొలతల అధికారులు ఆకస్మిక దాడి చేశారు. డిజిటల్ కాంటాను ఉపయోగించకుండా మాన్యువల్ కాంటా ఉపయోగిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు దాడులు చేసినట్టు జిల్లా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
ప్రభుత్వం ప్రతి ఐకేపీ కేంద్రానికి రెండు డిజిటల్ కాంటలను అందించామని... వాటినే ఉపయోగించాలని నిర్వాహకులకు సూచించారు. దీనిని మొదటి తప్పుగా పరిగణించి... నిర్వాహకులకు రూ.2 వేల జరిమానా విధించినట్టు తెలిపారు.
ఇదీ చూడండి: ఆశాకిరణంగా ఆక్స్ఫర్డ్ టీకా- 70 శాతం సమర్థత