ETV Bharat / state

పని ఒత్తిడితో ఉపాధ్యాయుడి ఆత్మహత్య - teacher suicide due to work pressure

ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. జీవితాన్ని ఆనందంగా గడపొచ్చని కలలు కన్నాడు. కానీ నాలుగు నెలలకే పని ఒత్తిడి వలన బతుకుపై విరక్తి చెంది.. తల్లిని క్షమించమంటూ సూసైడ్​ నోట్​ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ఉపాధ్యాయుడు.

పని ఒత్తిడితో ఉపాధ్యాయుడి ఆత్మహత్య
author img

By

Published : Oct 23, 2019, 6:34 PM IST

పని ఒత్తిడితో ఉపాధ్యాయుడి ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం అలుగునూర్​కు చెందిన పట్టేటి విద్యాసాగర్ (32) నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని టీఎస్ ఆర్​డబ్ల్యూఎస్ గురుకులంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. తిప్పర్తిలో స్కూల్​కు సరైన వసతులు లేక పోవడం వల్ల నల్గొండలో నిర్వహిస్తున్నారు. దసరా సెలవులకు తన స్వగ్రామంలో తల్లి శాంతమ్మ వద్ద ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. పాఠశాల అధికారుల ఒత్తిడి తట్టుకోలేక తిరిగి ఇంటికి వచ్చి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు."జాబ్ వచ్చింది. మంచి జీవితాన్ని ఆస్వాదించవచ్చు అనుకున్నా. కానీ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఆనందాన్ని కోల్పోయాను. పాఠశాల పని చేసుకోనివ్వకుండా పనికిమాలిన పనులు చెబుతూ ఫలితాలు మంచిగా రావాలి అని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు" అని విద్యాసాగర్​ తన సూసైడ్ నోట్​లో తెలిపాడు.

ఇవీ చూడండి: హాంగ్​కాంగ్​లో ప్రజా విజయం... 'చైనా బిల్లు' ఉపసంహరణ

పని ఒత్తిడితో ఉపాధ్యాయుడి ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం అలుగునూర్​కు చెందిన పట్టేటి విద్యాసాగర్ (32) నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని టీఎస్ ఆర్​డబ్ల్యూఎస్ గురుకులంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. తిప్పర్తిలో స్కూల్​కు సరైన వసతులు లేక పోవడం వల్ల నల్గొండలో నిర్వహిస్తున్నారు. దసరా సెలవులకు తన స్వగ్రామంలో తల్లి శాంతమ్మ వద్ద ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. పాఠశాల అధికారుల ఒత్తిడి తట్టుకోలేక తిరిగి ఇంటికి వచ్చి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు."జాబ్ వచ్చింది. మంచి జీవితాన్ని ఆస్వాదించవచ్చు అనుకున్నా. కానీ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఆనందాన్ని కోల్పోయాను. పాఠశాల పని చేసుకోనివ్వకుండా పనికిమాలిన పనులు చెబుతూ ఫలితాలు మంచిగా రావాలి అని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు" అని విద్యాసాగర్​ తన సూసైడ్ నోట్​లో తెలిపాడు.

ఇవీ చూడండి: హాంగ్​కాంగ్​లో ప్రజా విజయం... 'చైనా బిల్లు' ఉపసంహరణ

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dist: Suryapet.

పని వత్తిడి భరించలేక టిఎస్ ఆర్డబ్ల్యూఎస్ పాఠశాలలో పనిచేస్తున్న పట్టేటి విద్యాసాగర్ అనే వ్యక్తి ఆత్మహత్య.

నా చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి, తల్లిని క్షమించమని, ఉరి వేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన పట్టేటి విద్యాసాగర్ (32) నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం లోని టిఎస్ ఆర్డబ్ల్యూఎస్ గురుకుల పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. తిప్పర్తి లో స్కూల్ కు సరైన వసతులు లేక పోవడంతో నల్లగొండ పట్టణంలో ఆ స్కూల్ ను నిర్వహిస్తున్నారు. దసరా సెలవులకు తన స్వగ్రామమైన నూతనకల్ మండలం అలుగునూర్ కు వచ్చి తల్లి శాంతమ్మ వద్ద ఉంటూ తిరిగి పాఠశాల పునప్రారంభం రోజున నల్లగొండ లో నిర్వహిస్తున్న స్కూల్కు వెళ్లి, అక్కడ అధికారుల ఒత్తిడి తట్టుకోలేక తిరిగి ఇంటికి వచ్చి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
జాబ్ వచ్చింది మంచి జీవితాన్ని ఆస్వాదించవచ్చు అనుకున్న కానీ జాబు లో చేరినప్పటి నుంచి ఆనందాన్ని కోల్పోయానని పాఠశాల పనిని నేను చేసు కోనివ్వకుండా పనికిమాలిన పనులు చెబుతూ రిజల్ట్స్ మంచిగా రావాలి అని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని సూసైడ్ నోట్లో వెల్లడి.

ఉద్యోగం వచ్చింది జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు అని కలలు కన్నాడు, కానీ నాలుగు నెలలకే పని ఒత్తిడి వలన జీవితంపై విరక్తి చెంది,అమ్మా నన్ను క్షమించు , నా చావుకు ఎవరూ కారణం కాదు, పని ఒత్తిడి వల్లే నేను చనిపోతున్నాను అంటూ సూసైడ్ నోట్ రాసి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.