ETV Bharat / state

జాన్​పహాడ్ సైదన్న సన్నిథిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి

author img

By

Published : Jan 23, 2021, 11:03 PM IST

సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని జాన్​పహాడ్ దర్గాను కాంగ్రెస్​ సీనియర్​ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జాన్​పహాడ్ అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.

Senior Congress leader Uttam Kumar Reddy visited the John Pahad Dargah in suryapeta district
జాన్​పహాడ్ సైదన్న సన్నిథిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్​పహాడ్​ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా దర్గాను కాంగ్రెస్​ సీనియర్​ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. మత పెద్దలు, వక్ఫ్ బోర్డు అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఉత్తమ్​ పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో జాన్​పహాడ్ అభివృద్ధి చేశానని.. నేరేడుచర్ల, పాలకీడు మండలాల అభివృద్ధి అప్పుడే జరిగిందని ఉత్తమ్ అన్నారు. నేరేడుచర్ల, పాలకీడు, జాన్​పహాడ్ రోడ్డు నిర్మాణ పనులు తానే అభివృద్ధి చేసినట్లు గుర్తుచేశారు. హిందూ, ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా జాన్​పహాడ్ సైదన్న నిలిచాడన్నారు. రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: కుమారుని వివాహానికి కేసీఆర్​ను ఆహ్వానించిన సీపీ అంజనీకుమార్

సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్​పహాడ్​ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా దర్గాను కాంగ్రెస్​ సీనియర్​ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. మత పెద్దలు, వక్ఫ్ బోర్డు అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఉత్తమ్​ పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో జాన్​పహాడ్ అభివృద్ధి చేశానని.. నేరేడుచర్ల, పాలకీడు మండలాల అభివృద్ధి అప్పుడే జరిగిందని ఉత్తమ్ అన్నారు. నేరేడుచర్ల, పాలకీడు, జాన్​పహాడ్ రోడ్డు నిర్మాణ పనులు తానే అభివృద్ధి చేసినట్లు గుర్తుచేశారు. హిందూ, ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా జాన్​పహాడ్ సైదన్న నిలిచాడన్నారు. రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: కుమారుని వివాహానికి కేసీఆర్​ను ఆహ్వానించిన సీపీ అంజనీకుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.