ETV Bharat / state

న్యాయం చేయాలంటూ శవంతో రాస్తారోకో - Thirumalagiri news

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

న్యాయం చేయాలంటూ శవంతో రాస్తారోకో
న్యాయం చేయాలంటూ శవంతో రాస్తారోకో
author img

By

Published : Dec 13, 2020, 8:21 PM IST

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ... మృతుడి బంధువులు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఆందోళన చేపట్టారు.

తిరుమలగిరి మండల కేంద్రంలో ఈనెల 11న సాయంత్రం పులిగిళ్ల అంజయ్య, చిర్రబోయిన శ్యాం యాదవ్... పొలం పనుల నిమిత్తం ట్రాక్టర్​పై వెళ్తుండగా కిందపడి శ్యాం యాదవ్​కు త్రీవ గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఈనెల12న మృతుడి కుటుంబానికి ట్రాక్టర్ యజమాని రూ. 8 లక్షలు ఇచ్చేటట్లుగా పెద్దమనుషుల సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఆదివారం తుంగతుర్తి ఆసుపత్రిలో శపపరీక్ష నిర్వహించి తిరుమలగిరికి తీసుకొచ్చారు. అనంతరం ట్రాక్టర్ యజమాని పైసలు ఇవ్వననడం వల్ల ఆందోళన చేపట్టారు.

పోలీసుల సమక్షంలో మరోసారి చర్చలు జరపగా రూ. 4 లక్షలు ఇచ్చేందుకు యజమాని ఒప్పుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వల్ల సూర్యాపేట- జనగాం ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు.

ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా సూర్యాపేట డీఎస్పీ మోహన్ కుమార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. మరోసారి చర్చలు జరపగా బాధిత కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు ఇచ్చేవిధంగా యజమాని ఒప్పుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి: ఫలితాల షాక్ నుంచి సీఎం కోలుకోలేదు: డీకే అరుణ

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ... మృతుడి బంధువులు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఆందోళన చేపట్టారు.

తిరుమలగిరి మండల కేంద్రంలో ఈనెల 11న సాయంత్రం పులిగిళ్ల అంజయ్య, చిర్రబోయిన శ్యాం యాదవ్... పొలం పనుల నిమిత్తం ట్రాక్టర్​పై వెళ్తుండగా కిందపడి శ్యాం యాదవ్​కు త్రీవ గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఈనెల12న మృతుడి కుటుంబానికి ట్రాక్టర్ యజమాని రూ. 8 లక్షలు ఇచ్చేటట్లుగా పెద్దమనుషుల సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఆదివారం తుంగతుర్తి ఆసుపత్రిలో శపపరీక్ష నిర్వహించి తిరుమలగిరికి తీసుకొచ్చారు. అనంతరం ట్రాక్టర్ యజమాని పైసలు ఇవ్వననడం వల్ల ఆందోళన చేపట్టారు.

పోలీసుల సమక్షంలో మరోసారి చర్చలు జరపగా రూ. 4 లక్షలు ఇచ్చేందుకు యజమాని ఒప్పుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వల్ల సూర్యాపేట- జనగాం ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు.

ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా సూర్యాపేట డీఎస్పీ మోహన్ కుమార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. మరోసారి చర్చలు జరపగా బాధిత కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు ఇచ్చేవిధంగా యజమాని ఒప్పుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి: ఫలితాల షాక్ నుంచి సీఎం కోలుకోలేదు: డీకే అరుణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.