ETV Bharat / state

ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్లో పసలేదు: మంత్రి తలసాని - thalsani srinivas yadav cooments over cm kcr

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరిలో 5వ విడత చేపల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కలిసి ప్రారంభించారు.

'రాష్ట్రానికి కేసీఆర్... ముఖ్యమంత్రిగా ఉండటం అదృష్టం'
'రాష్ట్రానికి కేసీఆర్... ముఖ్యమంత్రిగా ఉండటం అదృష్టం'
author img

By

Published : Aug 7, 2020, 5:18 PM IST

రాష్ట్రానికి కేసీఆర్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం.. ప్రజల అదృష్టమని వ్యాఖ్యానించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరిలో 5వ విడత చేపల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సైదిరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్లో పసలేదని మంత్రి అన్నారు. ఎన్నికల్లో ఓడగొడితే ఇంట్లో ఖాళీగా కూర్చొని అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హుజూర్ నగర్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ యాదవులకు త్వరలో గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు.

రాష్ట్రానికి కేసీఆర్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం.. ప్రజల అదృష్టమని వ్యాఖ్యానించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరిలో 5వ విడత చేపల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సైదిరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్లో పసలేదని మంత్రి అన్నారు. ఎన్నికల్లో ఓడగొడితే ఇంట్లో ఖాళీగా కూర్చొని అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హుజూర్ నగర్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ యాదవులకు త్వరలో గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.