సూర్యాపేట జిల్లా ఫణిగిరిలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బౌద్ధ క్షేత్రాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి జస్టిస్ నాగరాజు సందర్శించారు. ఆయనతో పాటు జూనియర్ అసిస్టెంట్ వీరబాబు ఉన్నారు. అనంతరం గ్రామంలోని మ్యూజియంలో ఉన్న బౌద్ధ శిల్పాలను తిలకించారు.
ఫణిగిరిలో సీతారామ చంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఫణిగిరి సర్పంచ్ నరసింహారావు, బౌద్ధ క్షేత్ర సిబ్బంది గట్టు వీరయ్య, సోమారపు యాకయ్య, చిలుకూరి కార్తీక్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య