ETV Bharat / state

తామంతా ఒక్కటే.. తెరాస ఓటమే లక్ష్యం

author img

By

Published : Oct 1, 2019, 6:01 AM IST

ఉపఎన్నికల పోరులో తామంతా ఒక్కటేనన్న సందేశాన్నిస్తూ... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెరాస సర్కారుపై విరుచుకుపడ్డారు. పద్మావతి నామినేషన్ ముగిసిన అనంతరం సాయంత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి... బహిరంగ సభ ఏర్పాటు చేశారు. భట్టి, పొన్నం, శ్రీధర్ బాబుతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలంతా సభలో పాల్గొని సీఎం కేసీఆర్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

హుజూర్​నగర్​లో కాంగ్రెస్ బహిరంగ సభ
హుజూర్​నగర్​లో కాంగ్రెస్ బహిరంగ సభ

హుజూర్​నగర్ ఉపఎన్నిక పోరులో అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ... తెరాసపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దర్పం చెలాయిస్తున్నారంటూ కేటీఆర్​పై... టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మండిపడ్డారు. సతీమణి గెలుపు కాంక్షిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి... హుజూర్​నగర్ పబ్లిక్ క్లబ్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలు భట్టి, పొన్నం, శ్రీధర్ బాబు, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ తోపాటు... ఉమ్మడి నల్గొండకు చెందిన జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రెడ్డి హాజరయ్యారు.

ప్రజలకు, నియంతకు మధ్య పోరు..

తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పట్నుంచి హుజూర్​నగర్ నియోజకవర్గంలో... రూ. 2 వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేశానని ఉత్తమ్ వివరించారు. ఒక శాసనసభ్యుడు ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేయడం దేశంలో ఎక్కడా లేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ తీరుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు, నియంతకు మధ్య జరుగుతున్న పోరుగా... హుజూర్​నగర్ ఉపఎన్నికను అభివర్ణించారు. మిగులు బడ్జెట్​తో ఉన్న తెలంగాణను... ఆరేళ్ల పాలన కాలంలో అప్పుల రాష్ట్రంగా మార్చారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగు కుటుంబాలే బాగుపడ్డాయి..

ఉత్తమ్​తో అంటిముట్టనట్లుగా ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం... పద్మావతిని గెలిపించేందుకు అందరూ కష్టపడాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. 4 కోట్ల మంది బాగుపడాలన్న ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడితే... కేవలం నాలుగు కుటుంబాలే బాగుపడ్డాయని వెంకటరెడ్డి మండిపడ్డారు.

ఆనందంలో శ్రేణులు..

ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ నేతలంతా ఒకే వేదికపై కనిపించగా.. శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హుజూర్​నగర్ నియోజకవర్గంలో బంధువర్గం, అభిమానులు అధికంగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి... ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కార్యకర్తల నుంచి పెద్దపెట్టున అనుకూల నినాదాలు వినిపించాయి.

ఇదీ చూడండి: హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతి నామినేషన్

హుజూర్​నగర్​లో కాంగ్రెస్ బహిరంగ సభ

హుజూర్​నగర్ ఉపఎన్నిక పోరులో అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ... తెరాసపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దర్పం చెలాయిస్తున్నారంటూ కేటీఆర్​పై... టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మండిపడ్డారు. సతీమణి గెలుపు కాంక్షిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి... హుజూర్​నగర్ పబ్లిక్ క్లబ్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలు భట్టి, పొన్నం, శ్రీధర్ బాబు, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ తోపాటు... ఉమ్మడి నల్గొండకు చెందిన జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రెడ్డి హాజరయ్యారు.

ప్రజలకు, నియంతకు మధ్య పోరు..

తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పట్నుంచి హుజూర్​నగర్ నియోజకవర్గంలో... రూ. 2 వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేశానని ఉత్తమ్ వివరించారు. ఒక శాసనసభ్యుడు ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేయడం దేశంలో ఎక్కడా లేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ తీరుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు, నియంతకు మధ్య జరుగుతున్న పోరుగా... హుజూర్​నగర్ ఉపఎన్నికను అభివర్ణించారు. మిగులు బడ్జెట్​తో ఉన్న తెలంగాణను... ఆరేళ్ల పాలన కాలంలో అప్పుల రాష్ట్రంగా మార్చారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగు కుటుంబాలే బాగుపడ్డాయి..

ఉత్తమ్​తో అంటిముట్టనట్లుగా ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం... పద్మావతిని గెలిపించేందుకు అందరూ కష్టపడాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. 4 కోట్ల మంది బాగుపడాలన్న ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడితే... కేవలం నాలుగు కుటుంబాలే బాగుపడ్డాయని వెంకటరెడ్డి మండిపడ్డారు.

ఆనందంలో శ్రేణులు..

ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ నేతలంతా ఒకే వేదికపై కనిపించగా.. శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హుజూర్​నగర్ నియోజకవర్గంలో బంధువర్గం, అభిమానులు అధికంగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి... ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కార్యకర్తల నుంచి పెద్దపెట్టున అనుకూల నినాదాలు వినిపించాయి.

ఇదీ చూడండి: హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతి నామినేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.