ETV Bharat / state

జీవో 203 రద్దుకు అఖిలపక్షం నిరసన దీక్ష - జీవో 203 రద్దుకు అఖిలపక్షం నిరసన దీక్ష

పోతిరెడ్డిపాడు నిల్వ సామర్ధ్యం పెంచుతూ.. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం 203ను రద్దు చేయాలని సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్​ పట్టణంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.

All Parties Protest On G.O No. 203 In Huzur nagar Town
జీవో 203 రద్దుకు అఖిలపక్షం నిరసన దీక్ష
author img

By

Published : May 14, 2020, 10:05 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్​ పట్టణ కేంద్రంలో అఖిల పక్షం నాయకులు, రైతు సంఘాల నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నీటి నిల్వను మరో ఐదు టీఎంసీలు పెంచేలా నిర్ణయిస్తూ.. చేసిన 203 జీవోను రద్దు చేయాలని పట్టణంలోని ఇందిరా భవన్​లో నిరసన దీక్ష చేశారు.

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం చర్యల వల్ల తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, మహబూబ్​నగర్​ ఉమ్మడి జిల్లాలు ఎడారిగా మారుతాయని, సీఎం కేసీఆర్​ మౌనం వీడి ఈ అంశంపై స్పందించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్​ చేశారు. తెలంగాణ ఎడారిగా మారితే.. సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్​ పట్టణ కేంద్రంలో అఖిల పక్షం నాయకులు, రైతు సంఘాల నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నీటి నిల్వను మరో ఐదు టీఎంసీలు పెంచేలా నిర్ణయిస్తూ.. చేసిన 203 జీవోను రద్దు చేయాలని పట్టణంలోని ఇందిరా భవన్​లో నిరసన దీక్ష చేశారు.

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం చర్యల వల్ల తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, మహబూబ్​నగర్​ ఉమ్మడి జిల్లాలు ఎడారిగా మారుతాయని, సీఎం కేసీఆర్​ మౌనం వీడి ఈ అంశంపై స్పందించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్​ చేశారు. తెలంగాణ ఎడారిగా మారితే.. సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

ఇవీ చూడండి: ఆ అడవి నాదే..ఈ నగరం నాదే.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.