జహీరాబాద్ గ్రామీణ పోలీసు స్టేషన్లో డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డయల్ 100పై సమీక్షించారు. బాధితులు ఫోన్ చేస్తే వెంటనే స్పందించి సహాయం అందించాలని ఆదేశించారు. బాధితులు స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే తమ పరిధి కాదని పంపకుండా సమస్యను పరిష్కరించాలని సూచించారు. అత్యవసర సమయంలో మాత్రమే 100 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. సమావేశంలో డీఎస్పీ గణపథ్ జాదవ్, సీఐలు సైదేశ్వర్, కృష్ణ కిశోర్, జహీరాబాద్ పట్టణ, గ్రామీణ, చిరాగ్ పల్లి, హద్నూర్ ఝరాసంగం, రాయికోడ్ ఠాణా సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తలను గోడకు బాదుకొని... టీచరే కొట్టిందని చెప్పింది..