ETV Bharat / state

గజ్వేల్​లో కొవిడ్ నిబంధనల నడుమ ప్రశాంతంగా పోలింగ్

author img

By

Published : Apr 30, 2021, 12:23 PM IST

గజ్వేల్​లో జరుగుతున్న ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

peaceful polling in gajwel municipality at siddipet district
కొవిడ్ నిబంధనల నడుమ ప్రశాంతంగా పోలింగ్

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 1,470 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మాస్క్ ధరించిన వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు కల్పిస్తున్నారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 1,470 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మాస్క్ ధరించిన వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు కల్పిస్తున్నారు.

ఇదీ చూడండి: 3 మున్సిపాలిటీల్లో 9 వరకు సగటున 10 శాతం పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.