ETV Bharat / state

భారీగా నల్లబెల్లం స్వాధీనం చేసుకున్న అధికారులు - సిద్దిపేట జిల్లాలో భారీగా నల్లబెల్లం స్వాధీనం

లాక్​డౌన్​తో మద్యం దుకాణాలు మూతపడటంతో అక్రమ మద్యం తయారీ జోరుగా సాగుతోంది. మద్యం తయారీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన నల్లబెల్లాన్ని సిద్దిపేట జిల్లాలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

nallabellam seized in siddipetq
భారీగా నల్లబెల్లం స్వాధీనం చేసుకున్న అధికారులు
author img

By

Published : Apr 29, 2020, 2:24 PM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూతపడటంతో మద్యం ప్రియులు మద్యం కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలోని రాజిరెడ్డి అనే వ్యక్తి వద్ద ఆబ్కారీ అధికారులు భారీగా నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.

మండలంలో నాటుసారా తయారీ జరుగుతోందన్న సమాచారం మేరకు గ్రామాలలో సోదాలు చేయగా.. పోతారంలో 20 క్వింటాళ్ళ నల్ల బెల్లం డంపు దొరికినట్లు అధికారులు వెల్లడించారు. బెల్లాన్ని స్వాధీనం చేసుకుని రాజి రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.

లాక్​డౌన్​ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూతపడటంతో మద్యం ప్రియులు మద్యం కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలోని రాజిరెడ్డి అనే వ్యక్తి వద్ద ఆబ్కారీ అధికారులు భారీగా నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.

మండలంలో నాటుసారా తయారీ జరుగుతోందన్న సమాచారం మేరకు గ్రామాలలో సోదాలు చేయగా.. పోతారంలో 20 క్వింటాళ్ళ నల్ల బెల్లం డంపు దొరికినట్లు అధికారులు వెల్లడించారు. బెల్లాన్ని స్వాధీనం చేసుకుని రాజి రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ఇవీ చూడండి: సాదాసీదాగా తెజస వార్షికోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.