ETV Bharat / state

నియంత్రిత సాగు విధానానికి 29 గ్రామాల రైతుల ఆమోదం - సిద్ధిపేట జిల్లా వార్తలు

ప్రభుత్వం చెప్పినట్టు నియంత్రిత సాగు విధానం పాటించి ముఖ్యమంత్రి, వ్యవసాయ అధికారులు సూచించిన పంటలే వేస్తామని గజ్వేల్​ నియోజకవర్గం జగదేవ్​పూర్​ మండలంలోని 29 గ్రామాల రైతులు ఏకగ్రీవంగా తీర్మానించి జిల్లా కలెక్టర్​కు అందించారు. అధికారుల ప్రస్తావన లేకుండా.. రైతులే మాట్లాడుకొని ఏకగ్రీవంగా తీర్మానించడం సంతోషకర విషయమని జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు.

JagadevPur Formers Decide To Follow Government Crop Plan
నియంత్రిత సాగు విధానానికి 29 గ్రామాల రైతుల ఆమోదం
author img

By

Published : May 25, 2020, 8:53 PM IST

సిద్ధిపేట జిల్లా గజ్వేల్​ నియోజకవర్గం జగదేవ్​పూర్​ మండల పరిధిలోని 29 గ్రామ పంచాయితీల రైతులు ప్రభుత్వం సూచించిన పంటలే వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించి జిల్లా కలెక్టర్​ వెంకట్రామిరెడ్డికి అందించారు. రైతులకు గిట్టుబాటు ధర అందిస్తూ.. ఏ సమయంలో ఏ పంట పండిస్తే ఎలాంటి లాభాలు వస్తాయో ఆలోచించి సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని జిల్లా కలెక్టర్​ అన్నారు. వ్యవసాయంలో సమూల మార్పులు తేవాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. రైతులకు సాగునీరు అందించడం కోసం జిల్లాలో రిజర్వాయర్లు నిర్మించి కాల్వల ద్వారా పంట పొలాలకు నీరందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసి సఫలమైందని అన్నారు. కలెక్టర్లు, రైతుబంధు ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, మండల అధికారులు అందరూ కలిసి.. నియంత్రిత సాగు విధానం అమలయ్యేలా చూడాలని కలెక్టర్​ ఆదేశించారు.

వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలను తీసుకురావాలనే ఉద్దేశంతో పరిశోధన శాఖ , మార్కెటింగ్ అంచనాల కమిటీలను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. రైతులకు కావలసిన వనరులను సమకూర్చి.. వాటిని ఏ సమయంలో ఎలా వినియోగించాలనేది అధ్యయనం చేయాలని కలెక్టర్​ అన్నారు. ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల ఆధారంగా రాష్ట్రంలో 60 నుంచి 65 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు.

వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే అనుబంధ రంగాలు సైతం అభివృద్ధి చెందుతాయని కలెక్టర్​ అన్నారు. ప్రస్తుతం జిల్లాలో 127 వ్యవసాయ క్లస్టర్లున్నాయని ఒక్కొక్క క్లస్టర్​కి ఒక వేదిక ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశానుసారం 127 వేదికలను జిల్లాలో నాలుగు నెలల్లో ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలుస్తామని కలెక్టర్​ తెలిపారు.

ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు

సిద్ధిపేట జిల్లా గజ్వేల్​ నియోజకవర్గం జగదేవ్​పూర్​ మండల పరిధిలోని 29 గ్రామ పంచాయితీల రైతులు ప్రభుత్వం సూచించిన పంటలే వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించి జిల్లా కలెక్టర్​ వెంకట్రామిరెడ్డికి అందించారు. రైతులకు గిట్టుబాటు ధర అందిస్తూ.. ఏ సమయంలో ఏ పంట పండిస్తే ఎలాంటి లాభాలు వస్తాయో ఆలోచించి సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని జిల్లా కలెక్టర్​ అన్నారు. వ్యవసాయంలో సమూల మార్పులు తేవాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. రైతులకు సాగునీరు అందించడం కోసం జిల్లాలో రిజర్వాయర్లు నిర్మించి కాల్వల ద్వారా పంట పొలాలకు నీరందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసి సఫలమైందని అన్నారు. కలెక్టర్లు, రైతుబంధు ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, మండల అధికారులు అందరూ కలిసి.. నియంత్రిత సాగు విధానం అమలయ్యేలా చూడాలని కలెక్టర్​ ఆదేశించారు.

వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలను తీసుకురావాలనే ఉద్దేశంతో పరిశోధన శాఖ , మార్కెటింగ్ అంచనాల కమిటీలను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. రైతులకు కావలసిన వనరులను సమకూర్చి.. వాటిని ఏ సమయంలో ఎలా వినియోగించాలనేది అధ్యయనం చేయాలని కలెక్టర్​ అన్నారు. ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల ఆధారంగా రాష్ట్రంలో 60 నుంచి 65 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు.

వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే అనుబంధ రంగాలు సైతం అభివృద్ధి చెందుతాయని కలెక్టర్​ అన్నారు. ప్రస్తుతం జిల్లాలో 127 వ్యవసాయ క్లస్టర్లున్నాయని ఒక్కొక్క క్లస్టర్​కి ఒక వేదిక ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశానుసారం 127 వేదికలను జిల్లాలో నాలుగు నెలల్లో ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలుస్తామని కలెక్టర్​ తెలిపారు.

ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.