సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి పిల్లి వాగులో శనివారం అర్ధరాత్రి సమయంలో రెండు లారీలతో సహా డ్రైవర్, క్లీనర్ చిక్కుకున్నారు. తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో తంగళ్లపల్లి గ్రామస్థుడు జాలిగం నరేశ్ వారిని గమనించి స్థానికులకు సమాచారం అందించారు. వాగు వద్దకు చేరుకున్న గ్రామస్థులు తాడు సాయంతో వారిని కాపాడారు.
వాగులో చిక్కుకున్న వారిని.. డ్రైవర్ గోదావరిఖనికి చెందిన నరేశ్, క్లీనర్ కాసాల తిరుపతిగా గుర్తించారు. చీకట్లో వాగు ఉద్ధృతి గమనించక వచ్చామని వారు చెప్పారు. ఈ సంఘటనలో ఎవరికి ప్రమాదం జరగపోవడం వల్ల గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలుపణంగా పెట్టి తమను కాపాడిన గ్రామస్థులకు డ్రైవర్, క్లీనర్లు కృతజ్ఞతలు తెలిపారు.
- ఇదీ చూడండి లారీని ఢీకొట్టిన కారు-ఏడుగురు మృతి