రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదంటూ... సిద్దిపేట డయాలసిస్ సెంటర్లో పనిచేసే ఉద్యోగులు ధర్నాకు దిగారు. 5గంటల పాటు డయాలసిస్ సేవలను నిలిపివేశారు. డీమేడ్ కంపెనీకి చెందిన తాము సిద్దిపేట డయాలసిస్ సెంటర్లో 3సంవత్సరాలుగా పని చేస్తున్నట్లు వారు తెలిపారు.
కాగా రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని వాపోయారు. తమ సమస్యలను పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకే ధర్నా చేపట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్రాల్లో ఉద్యోగులు నిరసన చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇది చదవండి: