ETV Bharat / state

4ఏళ్లక్రితం కొడుకు, నేడు తండ్రి విద్యుదాఘాతంతో మృతి

సిద్దిపేట జిల్లాలో ఓ రైతు పొలంలో విద్యుదాఘాతం​తో మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలిచారు.

author img

By

Published : Aug 12, 2019, 1:18 PM IST

విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామంలో బూరు ఎర్రోళ్ల నాగయ్య (52) అనే రైతు తన పొలంలో విద్యుదాఘాతంతో మృతి చెందాడు. నాలుగేళ్ల క్రితం మృతుడి కొడుకు కూడా విద్యుదాఘాతంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం రైతు కుటుంబానికి అప్పగించారు.

విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి

ఇదీ చూడండి :రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామంలో బూరు ఎర్రోళ్ల నాగయ్య (52) అనే రైతు తన పొలంలో విద్యుదాఘాతంతో మృతి చెందాడు. నాలుగేళ్ల క్రితం మృతుడి కొడుకు కూడా విద్యుదాఘాతంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం రైతు కుటుంబానికి అప్పగించారు.

విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి

ఇదీ చూడండి :రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు

Intro:రైతు తన పొలంలో పచ్చగడ్డిని కోస్తూ విద్యుత్ షాక్ తో మృతి.Body:సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీ పేట గ్రామంలో బూరు ఎర్రోళ్ల నాగయ్య 52 అనే రైతు తన పంట పొలంలో వరి పైరు పక్కన పచ్చని గడ్డి కోస్తూ తన బోరు బావి నుండి కలపబడిన వైర్లను గమనించక పచ్చని గడ్డి కోసే క్రమంలో విద్యుత్ వైర్లు తగిలి రైతు మృతి చెందాడు.
రైతు మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి, అతని కొడుకు కూడా నాలుగేళ్ల క్రితం వారి పంట పొలంలో విద్యుత్ వైర్లు మరమ్మతు చేస్తుండగా విద్యుత్ షాక్ తో మరణించాడు.
ఆ సంఘటనను మరవకముందే మళ్లీ ఇప్పుడు పెద్దదిక్కు మృతిచెందడం ఆ కుటుంబాన్ని దుఃఖ సంద్రంలో కి నెట్టింది.
ఆ రైతు కుటుంబం పాలిట విద్యుత్తు యమపాశం లా మారింది.Conclusion:రైతు నాగయ్య భార్య గుండెలవిసేలా విలపించింది, ఆ దృశ్యం ఘటనా స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టించింది.

సంఘటనా స్థలానికి దుబ్బాక ఎస్సై సుభాష్ గౌడ్ చేరుకొని శవాన్ని పోస్టుమార్టం కోసం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం రైతు కుటుంబానికి అప్పగించారు.

ఎస్సై సుభాష్ గౌడ్ మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాల్లో ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని, విద్యుత్ వైర్లు విషయంలో జాగ్రత్తలు పాటించి, వాటిని సక్రమంగా అమర్చుకోవాలని అన్నారు, దీనివలన రైతులు విద్యుత్ ఘాతానికి గురికాకుండా ఉంటారని అన్నారు.

కిట్ నెంబర్:1272, బిక్షపతి, దుబ్బాక.
9347734523.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.