సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇంతవరకు ప్రారంభించకపోవడం వల్ల ఆరోగ్య కేంద్రం మందుబాబులకు అడ్డాగా మారిందన్నారు బీజేవైఎం జిల్లా నాయకులు కర్ణకంటి నరేష్.
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ప్రారంభించికపోవడం వల్ల చిన్న ఆరోగ్య సమస్యలకు, జ్వరాలకు సైతం 20 కి.మీ దూరంలో ఉన్న హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లాల్సి వస్తుందని, రవాణా సదుపాయాలు సరిగ్గా లేవని బీజేవైఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామవరం చుట్టుపక్కల ఉన్న 20 తండాల గిరిజనులు, సమీపంలో ఉన్న చిన్న చిన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వాధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఆకలి చావుల్లేవు: హైకోర్టు