కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని సంగారెడ్డి పోలీసులు హెచ్చరించారు. పట్టణంలో చెక్పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేశారు.
రాత్రి 7 గంటల తర్వాత రహదారిపైనకు వచ్చిన వారిని అడ్డుకున్నారు. అకారణంగా బయట తిరుగుతున్న వారి వాహనాలు సీజ్ చేశారు.