ETV Bharat / state

ఊరెళ్లి వచ్చేసరికే.. లక్షలు దోచేశారు

లాక్​డౌన్ కారణంగా స్వగ్రామానికి వెళ్లిన వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీ చేశారు. రూ. 6.8లక్షల నగదును దొంగిలించి వెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో చోటు చేసుకుంది.

author img

By

Published : May 28, 2020, 2:29 PM IST

theft-huge-money-in-a-home-in-lock-down-time-at-sangareddy
అర్ధరాత్రి చోరి... రూ.6.8లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ఓ ఇంట్లో... ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టిన దుండగులు పెద్ద ఎత్తున నగదు దోచుకెళ్లారు. ఎల్​ఐజీ క్వార్టర్ నెంబర్​ 162లో సత్యనారాయణ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. లాక్​డౌన్ సడలింపు నేపథ్యంలో ఏపీలోని తన స్వగ్రామమైన రాజోలుకు కుటుంబంతో కలిసి వెళ్లాడు.

అర్ధరాత్రి చోరి... రూ.6.8లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు

ఇదే అదనుగా భావించిన దుండగలు అర్థరాత్రి సమయంలో నెంబర్​లేని ద్విచక్రవాహనంపై వచ్చి ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని 6.8లక్షల నగదును దొంగలించారు. బంగారం కూడా పోయింది అనుకున్నప్పటికీ.. వెతకగా దొరికిందని పోలీసులు తెలిపారు. దొంగలు బైక్​పై వచ్చి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలలో నిక్షిప్తమయ్యాయి.

ఇవీ చూడండి: 'బోరు'న పొంగిన దుఃఖం.. బాలుడి కథ విషాదాంతం

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ఓ ఇంట్లో... ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టిన దుండగులు పెద్ద ఎత్తున నగదు దోచుకెళ్లారు. ఎల్​ఐజీ క్వార్టర్ నెంబర్​ 162లో సత్యనారాయణ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. లాక్​డౌన్ సడలింపు నేపథ్యంలో ఏపీలోని తన స్వగ్రామమైన రాజోలుకు కుటుంబంతో కలిసి వెళ్లాడు.

అర్ధరాత్రి చోరి... రూ.6.8లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు

ఇదే అదనుగా భావించిన దుండగలు అర్థరాత్రి సమయంలో నెంబర్​లేని ద్విచక్రవాహనంపై వచ్చి ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని 6.8లక్షల నగదును దొంగలించారు. బంగారం కూడా పోయింది అనుకున్నప్పటికీ.. వెతకగా దొరికిందని పోలీసులు తెలిపారు. దొంగలు బైక్​పై వచ్చి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలలో నిక్షిప్తమయ్యాయి.

ఇవీ చూడండి: 'బోరు'న పొంగిన దుఃఖం.. బాలుడి కథ విషాదాంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.