ETV Bharat / state

ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక వివాదం.. తీర్పు రిజర్వ్​ చేసిన హైకోర్టు

author img

By

Published : Dec 23, 2022, 9:30 PM IST

బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మదన్ మోహన్ రావు వేసిన పిటిషన్​పై విచారణ ముగిసింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వ్​ చేశారు.

హైకోర్టు
హైకోర్టు

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక వివాదంపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మదన్ మోహన్ రావు వేసిన పిటిషన్​పై విచారణ ముగిసింది. ఝార్ఖండ్​లో ఓ కేసులో శిక్ష పడిన విషయాన్ని ఎన్నికల అఫిడవిట్​లో ప్రస్తావించలేదని, కేసులను విస్తృతంగా ప్రచారం చేయాలన్న నిబంధననూ పాటించలేదని మదన్ మోహన్​రావు వాదన. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందున బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని మదన్ మోహన్ రావు హైకోర్టును కోరారు.

ఝార్ఖండ్​లో వేతనాలకు సంబంధించి కేసులో జరిమానా పడిందని.. అది ఈసీ నిబంధనల పరిధిలోకి రాదని బీబీ పాటిల్ తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వు చేశారు.

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక వివాదంపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మదన్ మోహన్ రావు వేసిన పిటిషన్​పై విచారణ ముగిసింది. ఝార్ఖండ్​లో ఓ కేసులో శిక్ష పడిన విషయాన్ని ఎన్నికల అఫిడవిట్​లో ప్రస్తావించలేదని, కేసులను విస్తృతంగా ప్రచారం చేయాలన్న నిబంధననూ పాటించలేదని మదన్ మోహన్​రావు వాదన. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందున బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని మదన్ మోహన్ రావు హైకోర్టును కోరారు.

ఝార్ఖండ్​లో వేతనాలకు సంబంధించి కేసులో జరిమానా పడిందని.. అది ఈసీ నిబంధనల పరిధిలోకి రాదని బీబీ పాటిల్ తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.