ETV Bharat / state

రాష్ట్రంలో నామినేషన్ ప్రక్రియ షురూ కేంద్రాల వద్ద 144 సెక్షన్​ అమలు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 10:25 AM IST

Updated : Nov 3, 2023, 11:16 AM IST

Telangana Election Arrangements 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఓటర్లలో అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ కావడంతో రాష్ట్రంలో నామినేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Telangana Assembly Elections 2023
Voters Awareness Programmes in Sangareddy

Voters Awareness Programmes ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్​

Telangana Election Arrangements 2023 : అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీస్​ శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భరోసా కల్పిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతోంది. నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో కేంద్రాల వద్ద పోలీసులు గస్తీతో పాటు.. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.

Security For Telangana Assembly Elections 2023 : మరోవైపు పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని కాలనీలలో ప్రత్యేక బృందాలు కవాతు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్‌ స్టేషన్ పరిధిలోని వివిధ కాలనీల ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు కవాతు నిర్వహించారు. హైదరాబాద్ వ్యాప్తంగా.. నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో కూడిన 18 చెక్‌పోస్టులను ఏర్పాటు(Check Posts Arranged) చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్‌ తెలిపారు. నామినేషన్ల కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని వెల్లడించారు

Voter Awareness Programs in Telangana 2023 : నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో అభ్యర్థుల నామినేషన్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలోని క్లాక్ టవర్ వద్ద పోలీసులు ఓటు హక్కు వినియోగంపై బైక్ ర్యాలీనీ నిర్వహించారు. ఓటు హక్కు వినియోగించుకునే తీరును బొమ్మల రూపంలో ప్రదర్శించారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈటీవీ- ఈనాడు ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని(Awareness Program on Voting Rights) నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ విచ్చేసి.. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు.

Special Interview on C Vigil APP : ఎన్నికల వేళ సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం సీ-విజిల్.. ఈ విషయాలు తెలుసుకోండి..!

"రానున్న ఎన్నికల్లో యువత అందరూ పాల్గొనాలి. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఏదైనా ఉల్లంఘన జరిగినట్టు అనిపిస్తే.. సీ-విజిల్​ అనే యాప్​ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. 100 నిమిషాల్లోపే సమాచారాన్ని తెలుసుకుని పరిష్కారం చేసేలా ఏర్పాట్లు చేస్తాం." - చంద్రశేఖర్‌, అదనపు కలెక్టర్‌, సంగారెడ్డి

Telangana Police Checking 2023 : ఎన్నికల దృష్ట్యా పోలీసుల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.439 కోట్ల నగదు పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు. భారీగా బంగారు, వెండి ఆభరణాలు, ఇతర కానుకలు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. లక్ష లీటర్లకు పైగా మద్యం, కోటీ 39 లక్షల విలువచేసే గంజాయి కూడా స్వాధీనం(Police Seized Ganja) చేసుకున్నట్లు తెలిపారు.

వీటితో పాటు ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసేందుకు తీసుకెళ్తున్న బియ్యం, కుక్కర్లు, చీరలు, గడియారాలు, ఫోన్లు, ఫ్యాన్లు, కార్లు మొదలైనవి పట్టుబడ్డాయి. మొత్తంగా అక్టోబరు తొమ్మిదో తేదీ నుంచి ఎన్నికల తనిఖీల్లో స్వాధీనమైన మొత్తం సొత్తు దాదాపు రూ.440 కోట్ల రూపాయలు దాటింది. ములుగు జిల్లాలోని లీలా గార్డెన్‌లో భారీగా ఆట సామగ్రి తరలిస్తున్న వాహనం పోలీసులకు పట్టుబడింది. యువతను ప్రలోభ పెట్టేందుకు భారీగా ఆట సామాగ్రిని తరలిస్తున్న సమయంలో.. పక్కా సమాచారంతో పోలీసులు వీరిని పట్టుకున్నారు.

'ప్రలోభాలకు లొంగం, భవిష్యత్​ను ఆగం చేసుకోం'

Telangana Assembly Election Polling Arrangements : ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు.. ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసుల చర్యలు

EC Orders To Return Seized Money : 'మీ సొత్తును పోలీసులు సీజ్ చేశారా.. టెన్షన్ వద్దు.. మీ డబ్బు మీ వద్దకు వచ్చేస్తుందిక'

Voters Awareness Programmes ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్​

Telangana Election Arrangements 2023 : అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీస్​ శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భరోసా కల్పిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతోంది. నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో కేంద్రాల వద్ద పోలీసులు గస్తీతో పాటు.. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.

Security For Telangana Assembly Elections 2023 : మరోవైపు పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని కాలనీలలో ప్రత్యేక బృందాలు కవాతు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్‌ స్టేషన్ పరిధిలోని వివిధ కాలనీల ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు కవాతు నిర్వహించారు. హైదరాబాద్ వ్యాప్తంగా.. నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో కూడిన 18 చెక్‌పోస్టులను ఏర్పాటు(Check Posts Arranged) చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్‌ తెలిపారు. నామినేషన్ల కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని వెల్లడించారు

Voter Awareness Programs in Telangana 2023 : నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో అభ్యర్థుల నామినేషన్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలోని క్లాక్ టవర్ వద్ద పోలీసులు ఓటు హక్కు వినియోగంపై బైక్ ర్యాలీనీ నిర్వహించారు. ఓటు హక్కు వినియోగించుకునే తీరును బొమ్మల రూపంలో ప్రదర్శించారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈటీవీ- ఈనాడు ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని(Awareness Program on Voting Rights) నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ విచ్చేసి.. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు.

Special Interview on C Vigil APP : ఎన్నికల వేళ సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం సీ-విజిల్.. ఈ విషయాలు తెలుసుకోండి..!

"రానున్న ఎన్నికల్లో యువత అందరూ పాల్గొనాలి. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఏదైనా ఉల్లంఘన జరిగినట్టు అనిపిస్తే.. సీ-విజిల్​ అనే యాప్​ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. 100 నిమిషాల్లోపే సమాచారాన్ని తెలుసుకుని పరిష్కారం చేసేలా ఏర్పాట్లు చేస్తాం." - చంద్రశేఖర్‌, అదనపు కలెక్టర్‌, సంగారెడ్డి

Telangana Police Checking 2023 : ఎన్నికల దృష్ట్యా పోలీసుల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.439 కోట్ల నగదు పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు. భారీగా బంగారు, వెండి ఆభరణాలు, ఇతర కానుకలు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. లక్ష లీటర్లకు పైగా మద్యం, కోటీ 39 లక్షల విలువచేసే గంజాయి కూడా స్వాధీనం(Police Seized Ganja) చేసుకున్నట్లు తెలిపారు.

వీటితో పాటు ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసేందుకు తీసుకెళ్తున్న బియ్యం, కుక్కర్లు, చీరలు, గడియారాలు, ఫోన్లు, ఫ్యాన్లు, కార్లు మొదలైనవి పట్టుబడ్డాయి. మొత్తంగా అక్టోబరు తొమ్మిదో తేదీ నుంచి ఎన్నికల తనిఖీల్లో స్వాధీనమైన మొత్తం సొత్తు దాదాపు రూ.440 కోట్ల రూపాయలు దాటింది. ములుగు జిల్లాలోని లీలా గార్డెన్‌లో భారీగా ఆట సామగ్రి తరలిస్తున్న వాహనం పోలీసులకు పట్టుబడింది. యువతను ప్రలోభ పెట్టేందుకు భారీగా ఆట సామాగ్రిని తరలిస్తున్న సమయంలో.. పక్కా సమాచారంతో పోలీసులు వీరిని పట్టుకున్నారు.

'ప్రలోభాలకు లొంగం, భవిష్యత్​ను ఆగం చేసుకోం'

Telangana Assembly Election Polling Arrangements : ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు.. ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసుల చర్యలు

EC Orders To Return Seized Money : 'మీ సొత్తును పోలీసులు సీజ్ చేశారా.. టెన్షన్ వద్దు.. మీ డబ్బు మీ వద్దకు వచ్చేస్తుందిక'

Last Updated : Nov 3, 2023, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.