తెలంగాణ ఆవిర్భావ వేడుకలను సంగారెడ్డి జిల్లాలో నిరాడంబరంగా జరిపారు. జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాణిక్య రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహమూద్ ఫరీదుద్దీన్, అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో రమేశ్ బాబు, డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ గణపతి జాదవ్ జెండా ఎగురవేశారు.
నారాయణఖేడ్లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద తెలంగాణ అవతరణ వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్నందున భౌతిక దూరం పాటిస్తూ అవతరణ వేడుకలు జరిపారు.
- ఇదీ చూడండి : 'జలదీక్ష' భగ్నం.. అడుగడుగునా అడ్డగింతలు, అరెస్టులు