సంగారెడ్డి జిల్లాలో ఓ ఇంటిపై బొల్లారం పోలీసులు దాడులు జరిపి ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. జిన్నారం మండలం ఖాజీపల్లిలో ఓ ఇంటిలో పేకాట ఆడుతున్నారని సమాచారం అందిన వెంటనే బొల్లారం పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేశారు.
ఇందులో ఏడుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 52 పేకలు రూ 67,890 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: మధ్యాహ్నం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం..సండలింపులపై ఉత్కంఠ..