ETV Bharat / state

లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులే..

author img

By

Published : May 17, 2021, 4:33 PM IST

లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ హెచ్చరించారు. లాక్​డౌన్​ సమయంలో అనవసరంగా బయట తిరిగితే కేసులు పెడతామని అన్నారు.

sangareddy sp warned people over lockdown violations
లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులే..

లాక్​డౌన్​ ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంతో పాటు తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్​పోస్ట్​ను ఎస్పీ సందర్శించారు. ఆంక్షలు అతిక్రమించి అవసరం లేకుండా బయట తిరిగే వ్యక్తుల వాహనాలపై జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 2 వేలకుపైగా కేసులు నమోదు చేశామని గుర్తు చేశారు.

లాక్​డౌన్ అమలు తర్వాత జిల్లాలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోందని, ఇదే విధంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కేటాయించిన సమయంలో అన్ని కార్యకలాపాలు నిర్వహించుకోవాలని సూచించారు. లాక్​డౌన్​ సమయంలో బయట తిరిగితే విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు పెడతామని హెచ్చరించారు.

లాక్​డౌన్​ ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంతో పాటు తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్​పోస్ట్​ను ఎస్పీ సందర్శించారు. ఆంక్షలు అతిక్రమించి అవసరం లేకుండా బయట తిరిగే వ్యక్తుల వాహనాలపై జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 2 వేలకుపైగా కేసులు నమోదు చేశామని గుర్తు చేశారు.

లాక్​డౌన్ అమలు తర్వాత జిల్లాలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోందని, ఇదే విధంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కేటాయించిన సమయంలో అన్ని కార్యకలాపాలు నిర్వహించుకోవాలని సూచించారు. లాక్​డౌన్​ సమయంలో బయట తిరిగితే విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు పెడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి; రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.