ETV Bharat / state

పాఠశాలకు వెళ్లి వస్తుండగా.. - One school Boy died in accident

పాఠశాలకు వెళ్లి వస్తానన్న కుమారుడిని డీసీఎం రూపంలో మృత్యువు కబళించింది. ఆ చిన్నారి తల్లిదండ్రుల్ని శోకసంద్రంలో ముంచింది. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా వీరారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది.

పాఠశాలకు వెళ్లి వస్తుండగా..
author img

By

Published : Mar 19, 2019, 6:23 AM IST

Updated : Mar 19, 2019, 7:31 AM IST

పాఠశాలకు వెళ్లి వస్తుండగా..
పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తానన్న కుమారుడిని డీసీఎం రూపంలో మృత్యువు కబళించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి సమీపంలో జరిగింది. కానుకుంట హైస్కూల్లో మల్లికార్జున్​ అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రోజులాగే సైకిల్​పై పాఠశాలకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం బాలుడి సైకిల్​నుబలంగా ఢీకొంది. తీవ్రగాయాలైన మల్లికార్జున్​ను నగరంలోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. ఈలోపే బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురు పిల్లల్లో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడం వల్లతల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:పారికర్​కు కడసారి వీడ్కోలు

పాఠశాలకు వెళ్లి వస్తుండగా..
పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తానన్న కుమారుడిని డీసీఎం రూపంలో మృత్యువు కబళించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి సమీపంలో జరిగింది. కానుకుంట హైస్కూల్లో మల్లికార్జున్​ అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రోజులాగే సైకిల్​పై పాఠశాలకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం బాలుడి సైకిల్​నుబలంగా ఢీకొంది. తీవ్రగాయాలైన మల్లికార్జున్​ను నగరంలోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. ఈలోపే బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురు పిల్లల్లో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడం వల్లతల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:పారికర్​కు కడసారి వీడ్కోలు

Intro:tg_nzb_07_18_nominationkosam_vachina_raithulu_pkg_c11
( ). నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీకి పసుపు, ఎర్రజొన్న రైతుల సమాయాత్తం..
పసుపు, ఎర్ర జొన్నలను ప్రభుత్వము కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని దీనికి నిరసనగా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల కు చెందిన పసుపు, ఎర్రజొన్న రైతులు గ్రామానికి ఐదుగురు చొప్పున నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేస్తామని వెల్లడించారు.
అందులో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వివిధ గ్రామాల రైతులు వచ్చి నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. తమకు ఎవరిపైన విద్వేషం లేదని తాము పెట్టిన పెట్టుబడులు సైతం తిరిగి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి దాదాపు 1000 నామినేషన్లు వేయాలని తమ సంఘాల తరఫున తీర్మానం చేశామని తెలిపారు. ఈరోజు నామ పత్రాలు తీసుకున్నామని రేపటినుండి నామినేషన్ల ప్రక్రియ మొదలుపెడతామన్నారు. స్పష్టమైన హామీ వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగిస్తామన్నారు.
byte. రాజేందర్ రైతు వన్నెల్ గ్రామం బాల్కొండ, నిజామాబాద్
byte. తిరుపతి రెడ్డి లక్ష్మాపూర్ గ్రామం జగిత్యాల
byte. వెంకటేష్ ఆర్మూర్, నిజామాబాద్


Body:నిజామాబాద్ అర్బన్


Conclusion:నిజామాబాద్
Last Updated : Mar 19, 2019, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.