ETV Bharat / state

Vaccine centers: వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు, రామచంద్రాపురం డివిజన్లలోని వ్యాక్సిన్ కేంద్రాలను ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి సందర్శించారు. అలాగే కానుకుంటలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

author img

By

Published : May 28, 2021, 4:26 PM IST

mla mahipal visited vaccine centers in sangareddy
వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు, రామచంద్రాపురం డివిజన్లలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరిశీలించారు. పటాన్​చెరులోని జీహెచ్ఎంసీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్​లో సూపర్ స్ప్రెడర్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని మహిపాల్ రెడ్డి సందర్శించారు. టీకాలు తీసుకునే వారు, వైద్య సిబ్బందితో కాసేపు ముచ్చటించారు.

అలాగే రామచంద్రపురం కానుకుంట బస్తీ దవాఖానలో జర్నలిస్ట్​, ఫ్రంట్​లైన్ వారియర్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అందిస్తున్న ఈ టీకాలను అర్హులైన వారు తీసుకోవాలని ఆయన అన్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు, రామచంద్రాపురం డివిజన్లలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరిశీలించారు. పటాన్​చెరులోని జీహెచ్ఎంసీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్​లో సూపర్ స్ప్రెడర్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని మహిపాల్ రెడ్డి సందర్శించారు. టీకాలు తీసుకునే వారు, వైద్య సిబ్బందితో కాసేపు ముచ్చటించారు.

అలాగే రామచంద్రపురం కానుకుంట బస్తీ దవాఖానలో జర్నలిస్ట్​, ఫ్రంట్​లైన్ వారియర్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అందిస్తున్న ఈ టీకాలను అర్హులైన వారు తీసుకోవాలని ఆయన అన్నారు.

ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.